కూలీలు దొరక్క.. సాగు చేయలేక
దేశానికి వెన్నుముక లాంటి వ్యవసాయ రంగానికి కూలీలు కరవవుతున్నారు.. జాతీయ ఉపాధి హామీ పథక ఉద్దేశం మంచిదైనా జిల్లాలో డెల్టా ప్రాంతాలైన తూర్పు మండలాల్లో కూలీల కొరత అన్నదాతను తీవ్రంగా వేధిస్తోంది..
ఉపాధి పనులకే పరిమితం
బీళ్లుగా భూములు
నగరి, న్యూస్టుడే: దేశానికి వెన్నుముక లాంటి వ్యవసాయ రంగానికి కూలీలు కరవవుతున్నారు.. జాతీయ ఉపాధి హామీ పథక ఉద్దేశం మంచిదైనా జిల్లాలో డెల్టా ప్రాంతాలైన తూర్పు మండలాల్లో కూలీల కొరత అన్నదాతను తీవ్రంగా వేధిస్తోంది.. ఉపాధి పనులకు వెళ్తోన్న కూలీలు క్రమేపీ వ్యవసాయ పనులు మరచిపోతున్నారని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా చెరకు, వరి, వేరుసెనగ, పూల తోటలతో ఏడాది పొడవునా పంటలు పండిచే నగరి నియోజకవర్గంలో కూలీలు లేక భూములు బీడుగా మారుతున్నాయి.. గతంలో వరినాట్లు, కలుపు తీయడం, పంట కోతలు, నూర్పిడి పనులకు అందుబాటులో ఉండేవారు.. ప్రస్తుతం ఉపాధి పనులకు పరిమితమై, పొలాల వైపు రావడం లేదని అంటున్నారు.
ఆవేదనలో అన్నదాతలు.. ఇటీవల నగరి మండల సమావేశానికి మంత్రి రోజా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో అన్నదాతలు వ్యవసాయ కూలీల కొరత సమస్య ప్రధానంగా ఉందని, భవిష్యత్లో పంటలు పండించడం సాధ్యం కాదని ఆమె దృష్టికి తెచ్చారు. ఉపాధి హామీ పథకం అమలు విధానంలో కొంత వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు సహకరించాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఇందుకు విరుద్ధమని అధికారులు సమాధానం చెప్పడంతో, ప్రత్యామ్నాయం చూపాలని రైతులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుకూలంగా వ్యవసాయ రంగానికి ఎందుకు అనుసంధానం చేయరాదని రైతులు ప్రశ్నించారు. అవసరం ఉన్న మండలాల్లోనైనా కూలీలను వ్యవసాయ పనులకు పంపాలని డిమాండ్ చేశారు.
కొంతమేరే యంత్రాల సాయం.. సాగులో అన్ని పనులు యంత్రాలతో సాధ్యం కాదు. ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులు కూలీలపైనే ఆధారపడతారు. వరినాట్లు, కలుపులు, కూరగాయలు, పూల తోటల్లో పనులకు వారి అవసరం చాలా ఉంది. ఉపాధి పనులున్న రోజుల్లో కూలీలు అందుబాటులో లేక వ్యవసాయం స్తంభించపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో వంద రోజులు ఉపాధి పనులు ఉంటాయి. మిగిలిన రోజుల్లోనే వ్యవసాయ పనులకు కూలీలు వస్తారు. అదునులో పనులకు కూలీలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
నగరి ప్రాంతంలో సాగు ఇలా..
చెరకు: 3,260 హెక్టార్లు
వేరుసెనగ: 1,370 హెక్టార్లు
వరి: 4,325 హెక్టార్లు
పొద్దుతిరుగుడు: 670 హెక్టార్లు
నువ్వులు: 70 హెక్టార్లు
ఉపాధి కూలీలు: 17వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి