పర్యాటకానికి వారధి.. ఏరీ సారథి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యాటక రంగం పడకేసింది. గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన నిర్మాణాలను ఎక్కడికక్కడ నిలిపేసిన ప్రస్తుత సర్కారు.. కొత్త ప్రతిపాదనలు రూపొందించి వాటినీ మూలన పడేసింది.
అవకాశాలున్నా పడకేసిన పర్యాటకం
అభివృద్ధిపై దృష్టిసారించని మంత్రి
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ననియాలలో అర్ధాంతరంగా నిలిచిన ఎకో టూరిజం ప్రాజెక్టు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యాటక రంగం పడకేసింది. గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన నిర్మాణాలను ఎక్కడికక్కడ నిలిపేసిన ప్రస్తుత సర్కారు.. కొత్త ప్రతిపాదనలు రూపొందించి వాటినీ మూలన పడేసింది. నాలుగేళ్ల వైకాపా పాలనలో ఈ రంగంలో సాధించిన ప్రగతి శూన్యమే. మూడు నెలల క్రితం సీఎం జగన్ తిరుపతిలో 7 స్టార్ హోటల్కు వర్చువల్గా భూమిపూజ చేసినా ఇది కేవలం ధనవంతులు బస చేయడానికే ఉపయోగపడుతుంది. పర్యాటక శాఖ మంత్రి రోజా జిల్లా నుంచి ప్రాతినిధ]్యం వహిస్తున్నా ఆమె మాటలకే పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.
ఈనాడు, చిత్తూరు, న్యూస్టుడే,తిరుపతి(నగరపాలిక): ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పేరుగాంచింది. పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తే దేశ విదేశాల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రామకుప్పం మండలంలోని ననియాలలో తెదేపా హయాంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అప్పట్లో ఎకో టూరిజం ప్రాజెక్టు నిర్మాణం రూ.2 కోట్లతో చేపట్టారు. మరికొన్ని వసతులు కల్పించేందుకు చేపట్టిన నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వీటికి నాలుగేళ్లుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో ప్రాజెక్టు నిస్తేజంగా మారింది. ఇదే మండలంలోని చెలిమిచేను జలపాతం, బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్, పలమనేరు మండలంలోని గంగనశిరస్సు జలపాతాలకు సరిగా రోడ్డు వసతి లేదు. పెనుమూరు మండలంలోని పులిగుండును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని పలుమార్లు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రకటించినా అమలుకాలేదు. జిల్లాకో శిల్పారామం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి రోజా గతంలో చెప్పారు. ఐరాల మండలంలో భూసేకరణ చేయాలని భావించినా కార్యరూపం దాల్చలేదు.
భవనం ఉన్నా.. అద్దెల భారం
తిరుపతిలో రుయా ఆసుపత్రి ఎదుట ఎకరం స్థలంలో 2013లో రూ.17 కోట్ల అంచనాలతో పర్యాటకశాఖ బహుళ ప్రయోజనాల్ని కాంక్షిస్తూ హరిత హోటల్ భవన సముదాయం నిర్మాణం చేపట్టింది. అందులో 110 గదులు, 200 మంది సామర్థ్యం గల హోటల్, అత్యాధునికమైన సమావేశ మందిరం, పర్యాటకశాఖ డివిజన్ కార్యాలయం, కేంద్రీయ విచారణ కార్యాలయం ఉండేలా భవన నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటికే రూ.11 కోట్లు ఖర్చు చేయగా.. మరో రూ.7కోట్లు వెచ్చిస్తే 2015లోనే నిర్మాణం పూర్తయ్యేది. ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. పెరిగిన అంచనాల ప్రకారం రూ.15 కోట్లు వెచ్చిస్తే పర్యాటకశాఖకు అత్యాధునిక భవనం సమకూరుతుంది. భవనం అందుబాటులోకి వస్తే పర్యాటకశాఖకు అద్దెల భారం నుంచి విముక్తి లభించడంతో పాటు నెలకు రూ.7 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.
తీర ప్రాంతాల్లో భూములు కేటాయించినా..
తిరుపతి జిల్లాలోనూ లెక్కకు మిక్కిలిగా జలపాతాలు ఉన్నాయి. వారాంతాల్లో తమిళనాడు నుంచి ఎక్కువ మంది ఇక్కడకు వస్తుంటారు. పుత్తూరు మండలంలో మూలకోన, నారాయణవనంలో కైలాసకోన, నాగలాపురంలో సద్దికూటిమడుగు, భూపతేశ్వరకోన, వరదయ్యపాళెంలో ఉబ్బలమడుగు, కేవీబీపురంలో ఆరె, వడమాలపేట, ఏర్పేడు పరిధిలో సదాశివకోన జలపాతాలు ఉన్నా వెళ్లేందుకు మార్గాలు సక్రమంగా లేవు. ఎర్రావారిపాళెంలో ప్రసిద్ధిగాంచిన తలకోన జలపాతం ఉన్నా సౌకర్యాల కొరత వేధిస్తోంది. వాకాడు మండలం తూపిలిపాళెంలో రిసార్ట్, అతిథి గృహాల నిర్మాణానికి 16 ఎకరాలు కేటాయించినా పనులు జరగడంలేదు. తడ మండలంలోని ఇరకం దీవిని అభివృద్ధి చేస్తామని మంత్రి, ఎమ్మెల్యే హామీ ఇచ్చినా ఆచరణలోకి రాలేదు. ఇందుకు సంబంధించి పర్యాటకాభివృద్ధి సంస్థకు భూములు కేటాయించినా ఫలితం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా శ్రేణుల్లో నూతనోత్సాహం
[ 02-12-2023]
శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి, తిరుమలకు వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడి పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి తెదేపా అధినేతకు జనం నీరాజనం పట్టారు. -
బాధ్యతగా వ్యవహరిద్దాం.. ఓటుహక్కు నిలుపుకొందాం
[ 02-12-2023]
ఓటరు జాబితాలో మీ వివరాలు తప్పుగా దొర్లాయా? కుటుంబసభ్యుల ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్నాయా? మీరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలో కాకుండా వేరేచోట ఓటుహక్కు ఉందా? 18 ఏళ్లు నిండినా ఇంకా ఓటు లేదా? ఇంట్లో ఎవరైనా మరణించినా వారి పేరు జాబితాలోనే అలానే ఉందా? ఇలాంటి తప్పిదాలను సరిచేసుకునేందుకు, కొత్తగా ఓటుహక్కు పొందేందుకు ఈనెల 9 వరకు అవకాశం ఉంది. -
మనదే.. తవ్వేయ్.. దోచేయ్
[ 02-12-2023]
భారీ పొక్లెయిన్లు, యంత్ర సామగ్రి సాయంతో సహజ కొండలు తవ్వేశారు.. టిప్పర్లు వరుస కట్టగా రేయింబవళ్లు వాహనాలతో అక్రమంగా తరలించారు.. తమ సంపద కొల్లగొడుతున్నారని అధికారులకు విజ్ఞప్తులు చేసినా అధికారులు పెడచెవిన పెట్టారు.. దీంతో గనులశాఖ నుంచి తీసుకున్న అనుమతుల కంటే అధికంగా తవ్వి సొమ్ము చేసుకోవడం గమనార్హం. -
లగేజీ కౌంటర్ల వద్ద డబ్బులు అడుగుతున్నారు
[ 02-12-2023]
‘తిరుమలలోని లగేజీ కౌంటర్ల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే బ్యాగులు విసిరేస్తున్నారు. నా బ్యాగులోని కొన్ని దుస్తులు కనిపించడం లేద’ని రాజమండ్రికి చెందిన కుమార్ తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. -
బకాయిలు కట్టకుంటే విద్యుత్తు కట్
[ 02-12-2023]
బకాయిలు కట్టుకుంటే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామంటూ రెస్కో అధికారులు శుక్రవారం సాయంత్రం కుప్పం పట్టణంలో హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం నుంచి మిన్నకుండిన అధికారులు సాయంత్రం 5.45 సమయంలో గృహాలు, దుకాణాల వద్దకు వచ్చి బకాయిలు కట్టాలంటూ డిమాండ్ చేశారు. -
ఆ ముగ్గురూ..!
[ 02-12-2023]
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా జాతీయ స్థాయిలో పాల్గొనేలా తీర్చిదిద్దడంలో ఈ మహిళా వ్యాయామ సంచాలకులు అవిరళ కృషి చేశారు.. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.. ఇలా ఎంతోమందిని తీర్చిదిద్ది ఉద్దండులుగా పేరొందారా మహిళా వ్యాయామ సంచాలకులు. -
త్వరలో జోన్కు 500 ఆర్టీసీ బస్సులు: ఈడీ
[ 02-12-2023]
ఆర్టీసీ అభివృద్ధి బాటలో నడుస్తోందని, మున్ముందు మరింత అభివృద్ధి సాధిస్తామని కడప జోన్ ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
క్లిక్ మనిపిస్తూ ... క్లిక్కయ్యాడు
[ 02-12-2023]
ఆ యువకుడికి వన్యప్రాణులు, అరుదైన పక్షులు, ప్రకృతి రమణీయతను ఛాయా చిత్రాలలో బంధించడమంటే సరదా. ఖాళీగా ఉంటే కెమెరా పట్టుకుని గ్రామానికి సమీపంలోని అడవిలో తిరుగుతూ రోజంతా గడిపేవాడు. -
ఈ రోడ్డుకు 30 ఏళ్లు..!
[ 02-12-2023]
తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల ప్రజల రాకపోకలకు అనువుగా రూ.కోటితో నిర్మించ తలపెట్టిన అంతర్రాష్ట్ర రోడ్డు నిర్మాణం 30 ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఈ రహదారి నిర్మాణాన్ని పట్టించుకోక పోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.. కేవలం కిలోమీటరున్నర మేర నిలిచిన రహదారి పనులకు కారణం సమీప తమిళనాడు అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడమే.. -
ప్రక్షాళనకు సమయమిదే!
[ 02-12-2023]
‘మా నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల అండదండలతో ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలు చేస్తున్నారు.. చనిపోయిన వ్యక్తుల పేర్లు కొనసాగిస్తున్నారు.. శాశ్వతంగా వెళ్లిపోయిన వ్యక్తుల పేర్లను కొనసాగిస్తున్నారు.. డబ్లింగ్ ఓట్లూ ఉన్నాయి..’ ..ఇవీ నిత్యం విపక్షాలతోపాటు ప్రజలు చేస్తున్న వ్యాఖ్యలు. -
సాదాబైనామాలకు సచివాలయాల్లో వసూళ్లు!
[ 02-12-2023]
సాదాబైనామాల దరఖాస్తుదారుల నుంచి వసూళ్లకు సచివాలయాలు వేదికగా మారాయి. దరఖాస్తులకు డిసెంబర్ ఆఖరుతో గడువు తీరనుండటంతో రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇక్కడ సిబ్బంది కొందరు.. వైకాపా నాయకులను దళారీలుగా ఏర్పాటు చేసుకుని వారి నుంచి వసూళ్ల తెరతీసి ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50 వేలు గుంజుతున్నారు. -
పొంచి ఉన్న ప్రమాదం.. అక్కడే పోలింగ్ కేంద్రం
[ 02-12-2023]
చంద్రగిరి నియోజకవర్గం కందులవారిపల్లి పంచాయతీ హరిజనవాడలోని అంగన్వాడీ కేంద్రంలో పద్దెనిమిది మంది చిన్నారులున్నారు. భవనం అందుబాటులో లేక గ్రామంలోని సమావేశ మందిరంలో కేంద్రం నిర్వహిస్తున్నారు. అందులో కనీస మౌలిక వసతులులేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
సర్వదర్శనానికి 5 గంటలు
[ 02-12-2023]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 5 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. -
గోవిందరాజస్వామి ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
[ 02-12-2023]
స్థానిక శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించింది. -
మొరాయించిన ఈకేవైసీ సర్వర్లు
[ 02-12-2023]
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈకేవైసీ సర్వర్లు మొరాయించాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సర్వర్లు అందుబాటులోకి రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా శుక్రవారం జరగలేదు.


తాజా వార్తలు (Latest News)
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు