logo

వృద్ధురాలి హత్యకేసులో అనుమానితుడు ఆత్మహత్య

ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లిలో వృద్ధురాలి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కాళ్ల వెంకటేశ్వరావు(28) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 23న అర్ధరాత్రి దూసర్ల సీత (72)ను హత్యచేసి ఆమె ఒంటిపైనున్న బంగారు

Published : 05 Dec 2021 06:26 IST

ఐ.పోలవరం, న్యూస్‌టుడే: ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లిలో వృద్ధురాలి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కాళ్ల వెంకటేశ్వరావు(28) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 23న అర్ధరాత్రి దూసర్ల సీత (72)ను హత్యచేసి ఆమె ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను అపహరించుకుపోయిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వేలిముద్రల ఆధారంగా నిందితులను ప్రాథమికంగా గుర్తించారు. విషయం తెలియడంతో వెంకటేశ్వరరావు పురుగు మందు తాగడంతో   కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా శుక్రవారం రాత్రి మృతిచెందాడు.  పూర్తి వివరాలు ఈ నెల 5న వెల్లడిస్తామని ఎస్సై రాజేష్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని