logo

టెండర్ల గడువు మళ్లీ పెంపు

జిల్లాలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో ధ్వంసమైన దారులు ఎప్పటికి బాగుపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.  ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క బిడ్డూ దాఖలు కాలేదు. తాజాగా ఎస్‌ఆర్‌ఆర్‌ ధరలు పెంచి పిలిచినా నాలుగోసారి నిరాశే ఎదురైంది.

Published : 05 Dec 2021 06:26 IST

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో ధ్వంసమైన దారులు ఎప్పటికి బాగుపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.  ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క బిడ్డూ దాఖలు కాలేదు. తాజాగా ఎస్‌ఆర్‌ఆర్‌ ధరలు పెంచి పిలిచినా నాలుగోసారి నిరాశే ఎదురైంది. 
* పదేపదే పిలిచినా...:  గతనెల 5న 457.242 కి.మీ. మేర 78 రోడ్లను బాగు చేయడానికి రూ.119.52 కోట్లతో, 159.146 కి.మీ. మేర 19 రహదారుల మరమ్మతులకు రూ.79.73 కోట్లతో టెండర్లు పిలిచారు. వీటికి గతనెల 26 వరకు గడువు ఇచ్చారు. ఒక్క పనికి కూడా బిడ్డు దాఖలు కాలేదు. దీంతో ఈనెల 3 వరకు టెండర్ల గడువు పెంచారు. ఇప్పుడు కూడా దాఖలు కాకపోవడంతో ఈనెల 7 వరకు కొన్ని, 9 వరకు మరికొన్ని పనులకు గడువు ఇవ్వాలని ర.భ.శాఖ చీఫ్‌ ఇంజినీరు కార్యాలయం నుంచి ఉత్తర్వులొచ్చాయి. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో గుత్తేదారులు స్పందించడం లేదు. సుమారు రూ.200 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల గతంలో చేసిన తాత్కాలిక మరమ్మతులకు తక్కువ మొత్తంలో బిల్లులు విడుదల చేశారు. దీంతో ఇప్పుడు పిలిచిన వాటికి బిడ్లు దాఖలు చేయాలని అధికారులు గుత్తేదారులను కోరుతున్నారు. గతంలో చేసిన పనులకు బిల్లులు ఇస్తేనే బిడ్లు వేస్తామని గుత్తేదారులు స్పష్టం చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని