logo

మంత్రి బొత్స పర్యటనకు ఏర్పాట్లు

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నెల 18న కాకినాడలో పర్యటిస్తారని అందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌, కార్పొరేటర్లతో

Published : 15 Jan 2022 03:06 IST


పరిశీలిస్తున్న కమిషనర్‌ తదితరులు

కాకినాడ కలెక్టరేట్‌: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ నెల 18న కాకినాడలో పర్యటిస్తారని అందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌, కార్పొరేటర్లతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. మహాలక్ష్మినగర్‌, దుమ్ములపేటలో నిర్మించిన తాగునీటి రిజర్వాయర్లు, జగన్నాథపురం రెల్లిపేటలో పారిశుద్ధ్య కార్మికుల క్వార్టర్స్‌, రాజాట్యాంకు పార్కులోని కళాక్షేత్రం, సైన్స్‌ సెంటర్‌, స్కేటింగ్‌ రింక్‌, సైకిల్‌ ట్రాక్‌ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అదనపు కమిషనర్‌ నాగనరసింహారావు, పర్యవేక్షక ఇంజినీరు సత్యనారాయణరాజు, ట్రాఫిక్‌ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, మున్సిపల్‌ ఇంజినీరు సత్యకుమారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని