ఉద్యానాలకు ప్రత్యేక శోభ
ఆకర్షణీయ నగరం కాకినాడలో కొత్తగా ఆయుర్వేద (హెర్బల్), సీతాకోక చిలుకల ఉద్యానాలు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే నగరవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యం కల్పించడానికి సైకిల్ ట్రాక్లు, ఉద్యాన వనాల సుందరీకరణ, వ్యాయామ సామగ్రిని
కాకినాడలోని సిద్ధార్థనగర్ ఉద్యానం
బాలాజీ చెరువు (కాకినాడ), న్యూస్టుడే: ఆకర్షణీయ నగరం కాకినాడలో కొత్తగా ఆయుర్వేద (హెర్బల్), సీతాకోక చిలుకల ఉద్యానాలు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే నగరవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యం కల్పించడానికి సైకిల్ ట్రాక్లు, ఉద్యాన వనాల సుందరీకరణ, వ్యాయామ సామగ్రిని అందుబాటులోకి తెచ్చారు. కళాక్షేత్రం, సైన్స్ సెంటర్ రూపుదిద్దుకుంటున్నాయి. కొత్తగా ఉద్యానాల ఏర్పాటుకు అనుమతి లభించడంతో కాకినాడ నగరం, గ్రామీణ మండలాల పరిధిలోని ఉద్యానాల్లో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే..
నగరపాలక సంస్థ పరిధిలోని కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే 1, 2, 3, 48, 49, 50 డివిజన్లతో నగర నియోజకవర్గంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఈ తరహాల ఉద్యానాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సుగంధ ద్రవ్యాలు, పరిమళాలు వెదజల్లే ఔషధ మొక్కలతో హెర్బల్ పార్కులను, సీతాకోక చిలుకల సంరక్షణ, పెంపకం తదితర యూనిట్లను ఏర్పాటుతో బటర్ఫ్లై పార్కులను తీర్చిదిద్దుతారు. త్వరలో డిజైన్లు రూపకల్పన చేయనున్నారు.
అభివృద్ధి ఇలా..
నగరపాలక సంస్థ పరిధిలో ఆరు పెద్దవి, 20 వరకు చిన్న పార్కులు ఉన్నాయి. వీటిలో పెద్ద పార్కులను స్మార్ట్సిటీ నిధులతో సుందరంగా తీర్చిదిద్ది మిగతా వాటి గురించి పట్టించుకోవడం మానేశారు. ఆయా చోట్ల హెర్బల్, బటర్ప్లై పార్కులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తొలుత 1, 2, 3 డివిజన్లలో సన్నాహాలు చేయనున్నారు. ఈ మూడు డివిజన్ల పరిధిలో లేఔట్లలో సామాజిక స్థలాలు అందుబాటులో ఉన్నందున అక్కడ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
త్వరలో ఆకృతులు సిద్ధం..
నగరంలో హెర్బల్, బటర్ఫ్లై పార్కుల ఏర్పాటుకు అనుమతి వచ్చింది. త్వరలో వీటికి ఆకృతులు తయారు చేస్తారు. వీటి ఏర్పాటుకు సంబంధించి స్థలాలను పరిశీలించాం. లేఔట్ స్థలాలను కూడా ప్రతిపాదిస్తాం. ఇవి అందుబాటులోకి వస్తే నగరానికి మరింత శోభ సంతరించుకోనుంది. - సత్యనారాయణరాజు, పర్యవేక్షక ఇంజినీరు, నగరపాలక సంస్థ, కాకినాడ
విద్యుత్తు నగర్లో రూపురేఖలు మారనున్న పార్కు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు