ధరల పెరుగుదలపై తెదేపా నిరసన
వైకాపా ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు నిరసనగా తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు. మండలంలోని ఇర్రిపాక గ్రామంలో శుక్రవారం ఉదయం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల
ప్రత్తిపాడు: భోగిమంటలో ఓటీఎస్ ప్రతులు వేస్తున్న వరుపుల రాజా తదితరులు
జగ్గంపేట గ్రామీణం, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు నిరసనగా తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు. మండలంలోని ఇర్రిపాక గ్రామంలో శుక్రవారం ఉదయం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల పట్టికను భోగి మంటల్లో వేశారు. అనంతరం నెహ్రూ మాట్లాడుతూ సామాన్యుడు భరించలేని విధంగా అన్ని రకాల సరకుల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. గ్యాస్, పెట్రోలు, పప్పు దినుసుల ధరలు పెరగడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారని అన్నారు. ఒకవైపు కరోనా ప్రభావంతో పనుల్లేక ఇబ్బంది పడుతుంటే వారిపై ధరల పెరుగుదల మరింత భారాన్ని మోపారన్నారు. పెరిగిన ధరలను తగ్గించి ప్రజలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
తొండంగి: రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలన, అందుకు అనుగుణంగా విడుదల చేసిన జీవో కాపీలను భోగిమంటల్లో వేసి శుక్రవారం తెదేపా నాయకులు నిరసన తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రతులను భోగిమంటల్లో వేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోడ వెంకటరమణ, రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి పేకేటి హరికృష్ణ, మురాలశెట్టి సత్తిబాబు పాల్గొన్నారు.
తుని పట్టణం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా శ్రేణులు వివిధ జీవోల ప్రతులు శుక్రవారం భోగిమంటల్లో వేసి తగులబెట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జి యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఇలా నిరసన తెలిపారు.
కోటనందూరు: ప్రజలను ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం విడుదల చేసిన వివిధ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని మండల తెదేపా అధ్యక్షుడు గాడి రాజబాబు డిమాండు చేశారు. బొద్దవరంలో శుక్రవారం వీటికి సంబంధించిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. లెక్కల భాస్కర్, బైలపూడి శ్రీరామమూర్తి, వెంకటరమణ పాల్గొన్నారు.
ప్రత్తిపాడు: ఓటీఎస్ పేరిట ప్రభుత్వం అక్రమ వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపిస్తూ తెదేపా శుక్రవారం తెల్లవారుజామున భోగిమంట వద్ద నిరసన తెలిపింది. ఇందుకు సంబంధించిన జీవో ప్రతులను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరుపుల రాజా, నాయకులు కొమ్ముల కన్నబాబు, యాళ్ల జగదీష్, మదినే వెంకన్నదొర, కార్యకర్తలు భోగిమంటలో వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు