కోడి కత్తే.. గెలిచింది...
సంక్రాంతి సంప్రదాయం ముసుగులో ఏటా నిర్వహించే కోడిపందేలను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బరులను దున్నేసినా.. కోడి కత్తిని అడ్డుకోలేకపోయారు. హడావుడి చేసిన వారు పత్తాలేకుండా పోవడంతో.. బరిలో నిలిచిన కోడికి
ముమ్మిడివరం, కాట్రేనికోన, న్యూస్టుడే: సంక్రాంతి సంప్రదాయం ముసుగులో ఏటా నిర్వహించే కోడిపందేలను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బరులను దున్నేసినా.. కోడి కత్తిని అడ్డుకోలేకపోయారు. హడావుడి చేసిన వారు పత్తాలేకుండా పోవడంతో.. బరిలో నిలిచిన కోడికి అడ్డూఆపూ లేకుండా పోయింది. జిల్లాలో శుక్రవారం భోగి రోజు ఉదయం నుంచి కోడి పందేలు ప్రారంభమయ్యాయి. కోనసీమతో పాటు రామచంద్రపురం డివిజన్, మెట్ట ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున వేశారు. ప్రధానంగా కోనసీమలోని కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన బరి చర్చనీయాంశంగా మారింది. కోనసీమ మండలాల్లోని గ్రామాల్లో 40కు పైగా బరుల్లో కోడిపందేలు నిర్వహించారు. వాటికి సమాంతరంగా గుండాట బోర్డులను ఏర్పాటు చేశారు. తొలి రోజు జిల్లాలో కోడిపందేలు, గుండాటల్లో రూ.110 కోట్ల నుంచి రూ.120 కోట్లు వరకు చేతులు మారినట్లు అంచనా.
ఆతిథ్యం అదరహో..
పల్లంకుర్రు బరిలో నిర్వాహకులు ఆతిథ్యం.. అదరహో అన్నట్లుగా చేశారు. పందేలకు హాజరైన వారికి కోనసీమ రుచులు వడ్డించారు. అరిసెలు, జంతికలు, బూరెలు, పూతరేకులు ఇలా.. వివిధ వంటకాలను గ్యాలరీల్లోని వారికి అందించారు. సుమారు నాలుగు వేల మందికి భోజనాల పొట్లాలను అందించే ఏర్పాట్లు చేశారు. ఇదే మండలం గెద్దనపల్లి బరిలో నిర్వాహకులు బుల్లెట్టు బండి బహుమతిని ప్రకటించారు. ఇక్కడ బరిలో రెండు జట్లు 10 కోడి పందేలు నిర్వహిస్తే.. మెజార్టీ పందేలు గెలిచిన వారికి ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా ఇవ్వనున్నారు.
కిక్కిరిసిన పల్లంకుర్రు
కాట్రేనికోన మండలంలో శివారు ప్రాంతం పల్లంకుర్రు.. సంక్రాంతి సందర్భంగా ఈ ప్రాంతం జనసంచారంతో కిక్కిరిసింది. మూడు రోజుల పాటు ఇక్కడ వాతావరణం తిరునాళ్లను తలపించనుంది. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున పందేలకు రావడంతో.. ఆ ప్రాంతంలో సుమారు 400లకు పైగా కార్లు నిలిపారు. ఇక మోటారు సైకిళ్లయితే లెక్కేలేదు. గేట్ పాస్లు చూపిన వారికే ప్రవేశం కల్పించారు. ఇక్కడి పెద్దబరిలో జరిగిన పందేల్లోనే ఒక్కో పందేనికి రూ.50 లక్షలు వరకు చేతులు మారినట్లు తెలుస్తోంది. నగదు లెక్కించేంయంత్రాలను పెట్టారు. పందేల్లో గెలిచిన వారికి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ చేతులమీదుగా వెండి నాణేలు అందించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ కోడిపందేలను తిలకించేందుకు వచ్చారు. వర్షం కారణంగా అరగంట పాటు పందేలు నిలిచిపోయాయి. వర్షం వల్ల బరి తడిచిపోకుండా బరకాలు కప్పారు.
కాట్రేనికోన: పల్లంకుర్రు బరి వద్ద కోలాహలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన