Ap News: కోనసీమలో వైభవంగా ప్రభలతీర్థ మహోత్సవం

కోనసీమలో ప్రభలతీర్థం మహోత్సవం వైభవంగా జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేట మండలం

Published : 16 Jan 2022 12:49 IST

అంబాజీపేట‌: కోనసీమలో ప్రభలతీర్థం మహోత్సవం వైభవంగా జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభలతీర్థ మహోత్సవాన్ని గత 420 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. మహోత్సవంలో భాగంగా జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రుల ప్రభలు ఏర్పాటు చేశారు. వాకలగరువు, తొండపూడిలో రాష్ట్రంలోనే ఎత్తైన ప్రభలు ఏర్పాటు చేశారు. ప్రభల మహోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ మహోత్సవాల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని