logo

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి దుర్మరణం

వేళంగి కొప్పిశెట్టివారిపేటకు చెందిన కక్కల సత్యనారాయణ(46) లారీడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శనివారం నడకుదురులోని మిల్లు వద్దనుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా

Published : 17 Jan 2022 05:07 IST

కరప: వేళంగి కొప్పిశెట్టివారిపేటకు చెందిన కక్కల సత్యనారాయణ(46) లారీడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శనివారం నడకుదురులోని మిల్లు వద్దనుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా దళమ్మచెరువుగట్టు వద్ద కాకినాడ నుంచి రావులపాలేనికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టి.. వెనుక చక్రాలు అతని తలపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఎస్సై రమేష్‌బాబు వచ్చి పరిశీలించి, మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. అతనికి భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని