ఆధ్యాత్మిక శోభ.. సంక్రాంతి ప్రభ
కోనసీమలోని పచ్చని చేలు ఆధ్యాత్మికతలో ఓలలాడాయి..సంక్రాంతి పర్వదినాల్లో కనుమ రోజు అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో నిర్వహించిన ప్రభల తీర్థానికి భక్తజనం పోటెత్తారు..అక్కడ కొలువయ్యే ఏకాదశరుద్రులను దర్శించుకునేందుకు ఆదివారం భారీగా తరలివచ్చారు.
జగ్గన్నతోటలో ఎగువ కౌశికనది దాటించి భుజాలపై
యువకులు మోసుకొస్తున్న గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం ప్రభలు
న్యూస్టుడే, అంబాజీపేట కోనసీమలోని పచ్చని చేలు ఆధ్యాత్మికతలో ఓలలాడాయి..సంక్రాంతి పర్వదినాల్లో కనుమ రోజు అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో నిర్వహించిన ప్రభల తీర్థానికి భక్తజనం పోటెత్తారు..అక్కడ కొలువయ్యే ఏకాదశరుద్రులను దర్శించుకునేందుకు ఆదివారం భారీగా తరలివచ్చారు. అందమైన రంగురంగుల నూలుతో నయనానందకరంగా ప్రభలను తీర్చిదిద్ది తీర్థానికి భక్తులు భుజాలపై మోసుకొచ్చారు. ప్రభలకు శిఖర భాగంలో త్రిశూలం, మధ్యభాగంలో మకర తోరణంతో ఉన్న మహారుద్రుడి ఉత్సవ ప్రతిమను కొలువుతీర్చి.. ఒక బల్లపై అమర్చిన ప్రభలను ‘అశ్శరభ..ఆశ్శరభ.. అంటూ శరణుఘోష చేస్తూ తీర్థానికి తీసుకురావటంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఆ దృశ్యం నయన మనోహరం..
గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు గ్రామాలకు చెందిన పార్వతీ వీరేశ్వరస్వామి, చెన్నమల్లేశ్వరస్వామి ప్రభలు స్థానికంగా ఉన్న ఎగువ కౌశికనదిని దాటించి తీసుకొచ్చారు. ఈ దృశ్యాలను అప్పటికే తీర్థంలో ఉన్న వేలాది మంది వీక్షించేందుకు పోటీపడ్డారు. నిండు ప్రవాహంతో ఉన్న ఎగువకౌశిక నదిలో దిగినప్పుడు ప్రభలను భుజాలపై మోస్తూ.. శివనామస్మరణ చేస్తూ తీరం దాటించే సన్నివేశం మహాద్భుతంగా ఆవిష్కృతŸమైంది. భక్తులు ఈ అపూరూప దృశ్యాల్ని రెప్ప వాల్చకుండా తిలకించారు.
పప్పులవారిపాలెం డ్యాంసెంటర్ వద్ద..
జయజయ ధ్వానాలతో..
వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి నుంచి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ నుంచి ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల నుంచి రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి నుంచి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి నుంచి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి వార్ల రూపాలతో పాటు కముజువారిలంక నుంచి ఉమామహేశ్వరస్వామి వారి ప్రభలను మంగళవాయిద్యాల నడుమ భక్తజనుల జయజయ ధ్వానాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో జగ్గన్నతోట తీర్థానికి తీసుకొచ్చారు.
జగ్గన్నతోటలో భక్త జనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్