గడువు మార్చినా..ప్చ్
జిల్లాలోని పురపాలక సంఘాల్లో 14వ ఆర్థిక సంఘం నిధులతో తలపెట్టిన పనులు ఒక అడుగు ముందుకి.. మూడు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారాయి. ఈ నిధుల వినియోగానికి సంబంధించి 2019లో గడువు పూర్తయినప్పటికీ.. కరోనా కారణంగా కేంద్రం రెండేళ్లుగా కాల పరిమితిని పొడిగించింది. అప్పటికీ పనులు చేయలేదు.
జిల్లాలోని పురపాలక సంఘాల్లో 14వ ఆర్థిక సంఘం నిధులతో తలపెట్టిన పనులు ఒక అడుగు ముందుకి.. మూడు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారాయి. ఈ నిధుల వినియోగానికి సంబంధించి 2019లో గడువు పూర్తయినప్పటికీ.. కరోనా కారణంగా కేంద్రం రెండేళ్లుగా కాల పరిమితిని పొడిగించింది. అప్పటికీ పనులు చేయలేదు. తాజాగా ఈ ఏడాది మార్చి నాటికి గడువు ముగియనుండడంతో అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులు కాస్తా మురిగిపోనున్నాయి.
14వ ఆర్థిక సంఘం నిధులతో ముంపు నివారణ లక్ష్యంగా రాజమహేంద్రవరం తిలక్రోడ్డు ప్రాంతంలో చేపట్టిన కాలువ నిర్మాణం కొంత మేర మాత్రమే పూర్తి చేశారు. కాలువ ఆనుకొని చేపట్టాల్సిన రోడ్డు పనులను కూడా నిలిపివేశారు. ఇటీవల వర్షాలకు రోడ్డు బాగా పాడవ్వడంతో తాత్కాలికంగా గుంతలు పూడ్చి సరిపెట్టారు.
నిధుల జాప్యంతో..
కరోనా ప్రభావం కారణంగా కేంద్రం 2018, 2019-20లో ప్రతిపాదించిన పనులకు సంబంధించి నిధులు విడుదల చేయలేదు. అంతకు ముందు జరిగిన వాటికి కూడా కేవలం 10 నుంచి 20 శాతం మాత్రమే విడుదలయ్యాయి. దీంతో గుత్తేదారులు మధ్యలో పనులు నిలిపివేశారు. కొన్నిచోట్ల ప్రారంభించి కొంత మేర చేసిన పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ యంత్రాంగం సైతం గుత్తేదారులపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే అన్నట్లు మారాయి. మార్చి నాటికి గడువు ముగియనుండడంతో కొన్ని పురపాలక సంఘాల్లో వాటిని సాధారణ నిధుల నుంచి వాటిని పూర్తిచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కరోనా ప్రభావంతో..
కరోనా కారణంగా 14వ ఆర్థిక సంఘం నిధులతో తలపెట్టిన పనులకు ఆటంకం కలిగింది. వాస్తవానికి 2015-16 నుంచి విడతల వారీగా నిధులు విడుదలయ్యాయి. లాక్డౌన్ అనంతరం రెండేళ్లు పనులు నిలిచిపోయాయి. తరువాత కేంద్రం మరో ఏడాది పాటు గడువు పొడిగించింది. 2019-20 నాటికి పూర్తి కావాల్సి ఉండగా 2020-21 వరకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.
నత్తనడకన..
14వ ఆర్థిక సంఘం నిధులను జిల్లాలోని పురపాలక సంఘాల్లో ప్రధానంగా తాగునీటి సౌకర్యం, డ్రైనేజీలు, రోడ్ల విస్తరణకు ఎక్కువగా కేటాయించారు. ఈ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అసౌకర్యానికి గురవు తున్నారు.
రాజమహేంద్రవరంలోని ఆవ నుంచి జాతీయ రహదారిని కలిపేలా వంద అడుగుల రోడ్డు నిర్మాణం తలపెట్టారు. పనులు మధ్యలో నిలిచిపోయాయి. కాలువను కొంత దూరం మాత్రమే వేసి వదిలివేయడంతో మురుగు నీరు ఖాళీ స్థలాల్లోకి వదిలేస్తున్నారు.సాధారణ నిధులతో పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
న్యూస్టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
ఆటంకం ఉండదు
14వ ఆర్థిక సంఘం నిధుల జాప్యం ప్రభావం అభివృద్ధి పనులపై పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర పనులకు సాధారణ నిధుల నుంచి కేటాయించాల్సిందిగా ఆదేశించాం. దీంతో పనులు నిలిచిపోయే ఆస్కారం ఉండదు. - సత్యనారాయణ, మున్సిపల్ ఆర్డీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో పలువురి చేరిక
[ 18-04-2024]
మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. -
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
[ 18-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
[ 18-04-2024]
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. -
చెప్పారంటే.. చేయరంతే!
[ 18-04-2024]
ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, -
అడ్డగోలుగా తవ్వేయ్.. అడ్డదారిలో అమ్మేయ్..
[ 18-04-2024]
అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. -
వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!
[ 18-04-2024]
ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. -
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
[ 18-04-2024]
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
తుంచేసిన కల.. కూత వినబడేదెలా
[ 18-04-2024]
దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. -
హామీల గారడి.. కోనసీమకు బురిడీ
[ 18-04-2024]
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. -
దళితులపై దాడులు చేసేవారికి జగన్ పదోన్నతులు
[ 18-04-2024]
దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. -
పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి
[ 18-04-2024]
రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ డిమాండ్ చేశారు. -
అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు
[ 18-04-2024]
సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
[ 18-04-2024]
మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. -
పవన్ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు
[ 18-04-2024]
పవన్ కల్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని..
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై