వెంటాడే భయం.. వెన్నంటే అభయం
పండగ తర్వాత కొవిడ్ కేసులు పెరుగుతాయనే అంచనాలు నిజమయ్యాయి. రాకపోకలు పెరగడం.. కొందరు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో మహమ్మారి దూకుడు పెరిగింది. పదుల నుంచి వందల సంఖ్యకు చేరడం కలవరపెడుతోంది. పరిస్థితి
అమాంతం పెరిగిన పాజిటివిటీ రేటు
24 గంటల్లో.. 919 మందికి వైరస్
ఈనాడు - కాకినాడ పండగ తర్వాత కొవిడ్ కేసులు పెరుగుతాయనే అంచనాలు నిజమయ్యాయి. రాకపోకలు పెరగడం.. కొందరు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో మహమ్మారి దూకుడు పెరిగింది. పదుల నుంచి వందల సంఖ్యకు చేరడం కలవరపెడుతోంది. పరిస్థితి ముందే ఊహించిన యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టిసారించింది.. అనుమానిత కేసులు గుర్తించడం.. వారికి పరీక్షలు.. వైద్యసేవలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కొవిడ్-19 నిబంధనలు సమర్థంగా పాటించడం.. టీకాలు వేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి భరోసా దక్కినట్లేనని వైద్య
నిపుణులు చెబుతున్నారు.
కేసులు పైపైకి..
పాజిటివ్ కేసుల తీవ్రత వారం రోజులుగా భారీగా పెరిగింది. నవంబరులో పాజిటివ్ రేటు 1.21 శాతం ఉంటే.. డిసెంబరులో 0.61 శాతానికి తగ్గింది.. జనవరి ప్రథమాంకంలో 5.86 శాతానికి పెరిగితే.. ఈ వారం ఏకంగా 13 శాతానికి చేరింది. తాజాగా 36.76 శాతం చేరింది. కొవిడ్కుతోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులూ వెంటాడుతున్నాయి. కొందరి నిర్లక్ష్యమే పరిస్థితికి కారణమనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం 3,343 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
లక్షణాలు మారాయి..
డెల్టా, డెల్టాప్లస్ లక్షణాలతోపాటు ఇప్పుడు వస్తున్న కేసుల్లో ఒంటినొప్పులు, వాంతులు, విరేచనాల లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయా లక్షణాలతోపాటు జలుబు, దగ్గు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. ప్రతి ఒక్కరూ మాస్కు, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం జాగ్రత్తలు తీసుకోవాలి.
- కిరణ్, ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు, జీజీహెచ్
సమర్థ సేవలకు సన్నాహాలు
కొవిడ్ వేళ 6,132 పడకలు సిద్ధం చేశాం. బొమ్మూరు, బోడసకుర్రు, జేఎన్టీయూ, కాకినాడ తితిదే కల్యాణ మండపంలోనూ పడకలు ఉంచుతున్నాం. హోమ్ ఐసొలేషన్ కోసం 60 వేల కిట్లు సిద్ధంచేశాం. రోజూ టెలీ కన్సల్టేషన్ ద్వారా ప్రతి రోగి ఆరోగ్యస్థితి తెలుసుకుని కిట్లు అందిస్తున్నాం. రోజుకు 2,500 పరీక్షలు చేస్తున్నాం. రాజమహేంద్రవరంలో ల్యాబ్ సిద్ధమైంది. అమలాపురంలో అందుబాటులోకి తెస్తాం.
- సి.హరికిరణ్, కలెక్టర్
తీవ్రత ఇక్కడే టాప్-10
* రాజమహేంద్రవరం గ్రామీణం * కూనవరం * రాజమహేంద్రవరం నగరం * కాకినాడ గ్రామీణం * ఎటపాక * చింతూరు * గోకవరం * రాజానగరం * కాకినాడ నగరం * అమలాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు