logo

పాత కక్షలతో పీక కోసి హత్యాయత్నం

పిఠాపురంలో పాత కక్షలతో ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు.. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్‌ సమీపంలో ఎడ్లపు ఏసుబాబు చికెన్‌ దుకాణంలో పనిచేస్తుంటాడు. గురువారం ఆయనపై షేక్‌లాలా సాహెబ్‌ బీరు

Published : 21 Jan 2022 04:42 IST


ప్రభుత్వాసుపత్రిలో ఏసుబాబుకు వైద్యం చేస్తున్న సిబ్బంది

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురంలో పాత కక్షలతో ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు.. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్‌ సమీపంలో ఎడ్లపు ఏసుబాబు చికెన్‌ దుకాణంలో పనిచేస్తుంటాడు. గురువారం ఆయనపై షేక్‌లాలా సాహెబ్‌ బీరు సీసా పగులగొట్టి విచక్షణారహితంగా దాడి చేశాడు. గాజు పెంకులతో పీీక కోసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అంబులెన్సులో ఏసుబాబును పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించినట్లు డాక్టర్‌ విజయశేఖర్‌ తెలిపారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని జీజీహెచ్‌ వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని