logo

‘జిల్లా ఆసుపత్రిని ఉన్నతంగా నిలుపుతాం’

రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిని రాష్ట్రంలో ఉన్నత స్థానంలో నిలబెట్టేలా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని ఎంసీహెచ్‌ భవనంలో గురువారం నిర్వహించారు. ఛైర్మన్‌ హోదాలో పాల్గొన్న కలెక్టర్‌ వివిధ అంశాలపై సమీక్షించిన అనంతరం

Published : 21 Jan 2022 04:42 IST


వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌.. వేదికపై ఎంపీ, ఎమ్మెల్యే, జేసీలు

రాజమహేంద్రవరం వైద్యం: రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిని రాష్ట్రంలో ఉన్నత స్థానంలో నిలబెట్టేలా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని ఎంసీహెచ్‌ భవనంలో గురువారం నిర్వహించారు. ఛైర్మన్‌ హోదాలో పాల్గొన్న కలెక్టర్‌ వివిధ అంశాలపై సమీక్షించిన అనంతరం మాట్లాడారు. సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి సిటీ స్కాన్‌ యంత్రం కొనుగోలుకు వైద్యవిధాన పరిషత్తు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారని, కుదరకపోతే సీఎస్‌ఆర్‌ నిధులతో యంత్రాన్ని సమకూర్చుతామన్నారు. రెండు అంబులెన్సుల మరమ్మతులకు రూ.1.90 లక్షలు వెంటనే బిల్లు చెల్లించాలని సూచించామన్నారు. మహాప్రస్థానం వాహనం త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు.

60 వేల కిట్లు

కొవిడ్‌ రెండో దశలో 1,200 మందిని వైద్య సేవలకు ఎంపిక చేశామని, ఇప్పుడు అవసరముంటే మళ్లీ తీసుకుంటామన్నారు. జిల్లాలో కొవిడ్‌ రోగుల కోసం 60 వేల హోం ఐసొలేషన్‌ కిట్లను సిద్ధం చేశామమన్నారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో పౌష్టికాహారంతోపాటు మెనూలో రోజూ చికెన్‌ పెడుతున్నామన్నారు. బయట ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కొవిడ్‌ పరీక్షలకు ప్రభుత్వం నిర్ధారించిన ధరలకే పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సిబ్బంది నగదు డిమాండ్‌పై ఫిర్యాదు

పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన మాధవలక్ష్మికి నెలలు నిండడంతో జిల్లా ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు పరీక్షించి మృతశిశువు అని తేలడంతో శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. శిశువును తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది రూ.3 వేలు డిమాండ్‌ చేశారని మాధవలక్ష్మి బంధువు గురువారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాము డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామన్నా వినిపించుకోకుండా శిశువును అలాగే వదిలేశారన్నారు.విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు.

ఆవేదన వ్యక్తం చేస్తున్న చాగల్లువాసి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని