లోకకల్యాణానికి కోటి తులసి పూజ
లోక కల్యాణార్థం అన్నవరం దేవస్థానంలో ఫిబ్రవరి 17 నుంచి 26 వరకు కోటి తులసి పూజ నిర్వహించడానికి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఛైర్మన్ ఐ.వి.రోహిత్ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈవో వి.త్రినాథరావు, సభ్యులు పలు
ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చిస్తున్న ఛైర్మన్, ఈవో, సభ్యులు
అన్నవరం: లోక కల్యాణార్థం అన్నవరం దేవస్థానంలో ఫిబ్రవరి 17 నుంచి 26 వరకు కోటి తులసి పూజ నిర్వహించడానికి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఛైర్మన్ ఐ.వి.రోహిత్ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈవో వి.త్రినాథరావు, సభ్యులు పలు అంశాలపై చర్చించారు.
ఇవీ తీర్మానాలు.. ప్రసాదం ప్యాకర్లకు ప్యాకెట్టు ఒక్కింటికి ఇచ్చే కమీషన్ రూ.0.70 నుంచి రూ.1.10కి పెంచడానికి ఆమోదించారు. సత్యదేవుని వార్షిక కల్యాణానికి రూ.3.5 లక్షలతో విద్యుత్తు అలంకరణ, రూ.6.3 లక్షలతో ఇతర పనుల నిర్వహణ. రూ.5 లక్షలతో గెద్దనాపల్లి వేణుగోపాల ఆలయంలో, రూ.2.15 లక్షలతో కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రంగులు వేయడానికి నిర్ణయించారు. దేవస్థానంలో ఖాళీగా ఉన్న ధార్మిక పోస్టుల భర్తీ, డిగ్రీ కళాశాలలో 9 మంది అధ్యాపకులకు గంటల పద్ధతిలో రెమ్యునరేషన్ చెల్లింపు, ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు జరిగే వివాహ శుభ కార్యాల్లో విష్ణుసదన్, ఉచిత కల్యాణ వేదిక శుభ్రం చేసేందుకు టెండర్ ద్వారా సిబ్బంది ఏర్పాటుకు నిర్ణయం. ఆప్కో వస్త్రదుకాణం అద్దెను రూ.2 వేలు నుంచి రూ.2,500కు పెంపు, గెద్దనాపల్లి వేణుగోపాల స్వామి సిబ్బంది జీతాల పెంపు.
ఇతర అంశాలు..
రోలుగుంటలో సత్యనారాయణస్వామి ఆలయాన్ని దత్తత తీసుకోవాలని చోడవరం ఎమ్మెల్యే విజ్ఞప్తిపై చర్చించి దేవస్థానానికి భారమవుతుందని తిరస్కరించారు. ప్రసాదం తయారీకి ఇత్తడి కళాయిలకు మరోసారి టెండర్లు పిలవాలని సభ్యులు సూచించారు. వ్రతాలకు తమలపాకులు వంద ఆకులు రూ.11.45కు టెండర్లకు ఆమోదం తెలిపారు. స్వామివారికి వజ్ర కిరీటం తయారీకి దాత బొడ్డు వెంకటరమణ కృషిని అందరూ అభినందించారు.
స్వల్ప వివాదం..
శంఖవరం మండలం గొందిలోని 34.73 ఎకరాల మాన్యంలో జామాయిల్ మోళ్లు తీసి, కర్ర తీసుకెళ్లి, భూమి చదునుపై చర్చ జరిగింది. వేలం రద్దు చేసి, సమగ్ర సర్వే చేసి విచారణ చేయాలని నిర్ణయించారు. దీనిపై చర్చిస్తుండగాపలువురు ఉద్యోగులు రావడంతో సభ్యులు అభ్యంతరం తెలిపారు. స్వల్ప వివాదం జరగ్గా, ఛైర్మన్, ఈవో జోక్యంతో సద్దుమణిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!