ఫలితాల్లో జాప్యం... బాధితుల్లో కలవరం
కొవిడ్ జోరు పెరిగినా ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేయక పోవడం.. ఫలితాల్లో తీవ్ర జాప్యంతో బాధితులకు కంటి మీద కునుకు కరవైంది. రూ.వెయ్యికి పైగా వెచ్చించి ప్రైవేట్గాపరీక్షలు చేయించాల్సి వస్తోందని వాపోతున్నారు. స్థోమత లేని వారు..
రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో నిరీక్షణ
కొవిడ్ లక్షణాలు ఉండటంతో రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో ఈనెల 18న పరీక్ష చేయించుకున్నా. నాలుగు రోజులు దాటినా ఫలితం రాలేదు. ఈలోపు ఓ వైద్యుడిని సంప్రదించి.. ఆయన సూచన మేరకు మందులు వాడా. శుక్రవారం ప్రైవేట్ ల్యాబ్లో ర్యాపిడ్ పరీక్ష చేయిస్తే పాజిటివ్గా తేలింది. - మణికంఠ,రాజమహేంద్రవరం
అమలాపురం ఆసుపత్రిలో ఈనెల 19న పరీక్ష చేయించా. ఇప్పటికీ ఫలితం రాలేదు. ముందుగానే మందులు వాడుతూ హోమ్ ఐసొలేషన్లో ఉన్నా. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నా. బయట ల్యాబ్ల్లో పరీక్ష చేయించాలంటే అధిక మొత్తంలో డబ్బులు అడుగుతున్నారు. స్థోమత లేక చేయించుకోలేదు. అధికారులు స్పందించి ఫలితాలు త్వరగా వచ్చేలా చొరవ చూపాలి. - నరేష్, అమలాపురం - మసీదుసెంటర్ (కాకినాడ), రాజమహేంద్రవరం వైద్యం
కొవిడ్ జోరు పెరిగినా ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేయక పోవడం.. ఫలితాల్లో తీవ్ర జాప్యంతో బాధితులకు కంటి మీద కునుకు కరవైంది. రూ.వెయ్యికి పైగా వెచ్చించి ప్రైవేట్గాపరీక్షలు చేయించాల్సి వస్తోందని వాపోతున్నారు. స్థోమత లేని వారు.. అలాగే ఉండిపోవడంతో ఆరోగ్యం క్షీణించి.. వైరస్ వ్యాప్తి కారకులుగా మారుతున్నారు. జిల్లాలో కేవలం కొన్ని ఆసుపత్రుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తుండటం.. సేకరించిన నమూనాలను కాకినాడకు తేవడంలో జాప్యం...ఫలితాల వెల్లడిలో ఆలస్యంతో కలవరం నెలకొంది.
ఎందుకిలా:రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రుల్లో నిరుడు సెప్టెంబరులో ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. కానీ వాటిని నేటికీ ప్రారంభించలేదు. ఆరోగ్య కేంద్రాల్లో మొదటి దశలో ర్యాపిడ్ యాంటిజన్, ట్రూనాట్ కిట్లతో కొవిడ్ పరీక్షలు చేసేవారు. ప్రస్తుతం ఆ పద్ధతి లేకపోవడమూ ఫలితాల జాప్యానికి కారణమే.●
కిట్లు తరలించరే: రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో సేకరించిన కొవిడ్ నమూనాలను రెండు రోజులకు ఒకసారి కాకినాడ పంపిస్తున్నారు. ● ఇటీవల రోజూ నమూనాలను తీసుకెళ్లే వాహనానికి పెట్రోలు బిల్లు చెల్లించకపోవడంతో నాలుగు రోజుల తర్వాత తీసుకెళ్లారు. ● ఇదే ఆసుపత్రిలో కొవిడ్ పరీక్షల కోసం ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లనే కేటాయించడంతో నమూనాల సేకరణ నత్తనడకన సాగుతోంది. రోజుకు 150-180 మంది నమూనాలు సేకరించి.. మిగిలిన వారిని మరుసటి రోజు రమ్మని టోకెన్లు ఇస్తున్నారు. ● అమలాపురం, తుని, రంపచోడవరంలోనూ ఇదే తీరు. దూర ప్రాంతాల నుంచి రవాణా ఇక్కట్లు, సమయానుకూలంగా స్పందన లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
కాకినాడలో ఇలాగండి...
కాకినాడ జీజీహెచ్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో పరీక్ష ఫలితాలు వెంటనే వస్తున్నా.. జిల్లా మొత్తానికి ఇదొక్కటే పరీక్షా కేంద్రం కావడం.. బాధితులు అధికంగా రావడంతో పరీక్ష కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక్కడ కేవలం రోజుకు నాలుగు వేల నమూనాల ఫలితాలు మాత్రమే తేల్చగలరు. రాజమహేంద్రవరం, అమలాపురంలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు ప్రారంభిస్తే జీజీహెచ్ ల్యాబ్పై ఒత్తిడి తగ్గుతుంది. జిల్లాలో ఎక్కడా కిట్ల కొరత లేకపోయినా పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతున్నాయి
రెండు, మూడురోజుల్లో చక్కదిద్దుతాం
జిల్లా మొత్తానికి కాకినాడలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఒక్కటే ఉంది. దూరప్రాంతాల నుంచి నమూనాలు జీజీహెచ్కు తరలించడంలో ఆలస్యం అవుతోంది. దీంతో ఒకరోజులో రావాల్సిన ఫలితం రెండు రోజుల్లో వస్తోంది. దీనిని అధిగమించేలా రెండు, మూడు రోజుల్లో రాజమహేంద్రవరం, అమలాపురం ఆసుపత్రుల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్లను అందుబాటులోకి తేనున్నాం. దాంతో సమస్య పరిష్కారం అవుతుంది. -డా.బి.మీనాక్షి, ఇన్ఛార్జి డీఎంహెచ్వో
అమలాపురంలో ప్రారంభానికి నోచని ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’