ఎక్కడెక్కడి దొంగలూ..ఇక్కడే!
మన్యంలో గంజాయి గుప్పుమంటోంది. అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఈ దందాలో కీలక భూమిక ఇతర రాష్ట్రాల వారిదే.. గిరిజనుల అవసరాలు ఆసరాగా చేసుకుని.. సాగు నుంచి సంరక్షణ వరకు అక్రమ వనాలకు మదుపు పెడుతున్న మాఫియా.. పంట చేతికొచ్చాక..
రూ.కోట్లు కొల్లగొడుతున్న గంజాయి మాఫియా
అడ్డదారుల్లో 15 రాష్ట్రాలకు తరలింపు
ఈనాడు, కాకినాడ
జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్న నిల్వలు
మన్యంలో గంజాయి గుప్పుమంటోంది. అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఈ దందాలో కీలక భూమిక ఇతర రాష్ట్రాల వారిదే.. గిరిజనుల అవసరాలు ఆసరాగా చేసుకుని.. సాగు నుంచి సంరక్షణ వరకు అక్రమ వనాలకు మదుపు పెడుతున్న మాఫియా.. పంట చేతికొచ్చాక.. పోలీసుల కళ్లుగప్పి.. అడ్డదారుల్లో తరలించి సొమ్ము చేసుకుంటోంది. పంట ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవడం ఒక ఎత్తయితే.. చేతికొచ్చిన సరకు సురక్షిత ప్రాంతాలకు తరలించి.. అక్కడి నుంచి వివిధ మార్గాల్లో హద్దులు దాటించి.. గమ్యసానాలకు చేర్చడం మరో ఎత్తుగా వ్యవహారం సాగుతోంది. రోజుకో కొత్తదారిలో గమనం సాగుతోంది.
స్వాధీనం చేసుకున్న లారీ
ఎక్కడ పండినా.. ఇక్కడ్నుంచే..
జిల్లాలో గంజాయి సాగు తక్కువే. పంట ఎక్కడ పండినా.. జిల్లా మీదుగా అక్రమంగా రవాణా అవుతోంది. మోతుగూడెం, డొంకరాయి, వై.రామవరం, చింతూరు ప్రాంతాల్లో సాగవుతోంది. మిగిలింది విశాఖ, ఒడిశా సరిహద్దుల నుంచి వస్తుందే.. గతంలో ఏడాదికి రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు అక్రమ నిల్వలు పట్టుకుంటే.. నిరుడు ఏకంగా రూ.16.70 కోట్ల విలువైన సరకు పట్టుకున్నారు.
పట్టుబడిన ద్రవరూప గంజాయి
పరారే.. పరారే...
2019లో 51 మంది, 2020లో 72 మంది పోలీసుల కళ్లుగప్పి పారిపోతే.. నిరుడు ఏకంగా 158 మంది నిందితులు పరారవడం గమనార్హం. ఆయా కేసుల్లో తప్పించుకున్నవారు పోను.. 1,091 మందిని జిల్లా పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సైతం.. స్టేషన్ నుంచి తప్పించుకున్న ఘటనలూ ఇటీవల జగ్గంపేటలో చోటుచేసుకున్నాయి.
కాదేదీ అనర్హం..
కార్లు, లారీలు.. నీళ్ల ట్యాంకులు, అంబులెన్సులు.. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ఇలా ఏ తరహా వాహనాలు వచ్చినా.. తనిఖీలు చేయాల్సిందే. ఏవోబీ నుంచి ఒంటికి చుట్టుకుని కాలినడకన కొందరు.. గుర్రాలు, గాడిదలపైనా మూటలతో మరికొందరు.. వాహనాల అరల్లో ఇమిడ్చి.. ద్రవ రూపంలోకి మార్చి ఇంకొందరు దాటిస్తున్నారు.
నర్సీపట్నం- పాయకరావుపేట మార్గాల్లో జిల్లాలోకి గంజాయి వస్తోంది. నర్సీపట్నం నుంచి ఏలేశ్వరం మీదుగా కొంత తరలిపోతుంటే.. అడ్డతీగల మీదుగా మరికొంత చొరబడుతోంది. గోకవరం- రంపచోడవరం- మారేడుమిల్లి- భద్రాచలం మీదుగా గుట్టుగా నిల్వలు సరిహద్దులు దాటుతున్నాయి.
లింకులు చాలా ఉన్నాయ్...
గంజాయి మాఫియా.. నిల్వల తరలింపులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెరవెనుక ఎవరు ఉన్నారనేది బయటకు పొక్కకుండా.. వ్యవహారం అంతా కిందిసాయి వారితోనే నడిపిస్తోంది. ఒకవేళ తరలింపు క్రమంలో చిక్కినా సూత్రధారులు ఎవరో బయటకు తెలీదు. వెరసి మూలాలు కనుక్కోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది.
పెట్టుబడి
గంజాయి సాగుకు పెట్టుబడి పెడుతున్నారు. వ్యవసాయ పంటల కంటే.. గంజాయి సాగుతో ఎక్కువ సంపాదించొచ్చనే ఆశ చూపుతున్నారు. సాగుకు అన్నీ సమకూరుస్తున్నారు.
తరలింపు
పండిన పంటను అటవీ మార్గంలో నిర్దేశిత రహస్య ప్రాంతాలకు చేర్చడం.. అక్కడి నుంచి రోడ్డు మార్గానికి తరలించడంలో ఎగుమతిదారు కీలక పాత్ర పోషిస్తున్నారు. గంజాయి నిల్వతో వెళ్తున్న వాహనానికి ఎస్కార్ట్ వాహనాలు ఉండి, పోలీసు జాడలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటాయి.
సరఫరా
గంజాయి నిల్వలు ఎక్కడెక్కడకు ఎంత పంపాలనేది వీరు చూస్తారు. ముందస్తు ఒప్పందం ప్రకారం సరకు వెళ్లేలా వీరు స్కెచ్ వేస్తారు. విద్యాలయాలు, ఇతర ప్రాంగణాల్లో ఈ మత్తుకు బానిసైన వారికి వివిధ రూపాల్లో సరకు చేరుస్తారు. ద్విచక్ర, ఇతర వాహనాల్లో సరకు రవాణాకు వీరిని వాడుకుని.. ప్యాకెట్లు, సిగరెట్ల రూపంలో మత్తు చేర్చేస్తారు.
నిరంతర నిఘా
తూర్పున గంజాయి సాగు తక్కువే అయినా.. జిల్లా మీదుగా తరలుతున్న దందాపై నిఘావేశాం. వ్యక్తిగతంగా, ముఠాల దన్నుతో తరలిస్తున్న 15 రాష్ట్రాల వారిని అరెస్టుచేశాం. అక్రమ సాగు, రవాణా ప్రోత్సహించే వారిపై దృష్టిపెట్టాం. ఆపరేషన్ పరివర్తన పేరుతో ప్రత్యేక డ్రైవ్ ముగిసినా, వాహన తనిఖీలు ఉంటాయి. ప్రభావిత ప్రాంతాల్లో పరిసితిని ఎప్పటికప్పుడు చక్కదిద్దుతున్నాం. - రవీంద్రనాథ్బాబు, జిల్లా ఎస్పీ
అడ్డదారులెన్నో...
నడక దారులు 5
లోడింగ్ పాయింట్లు 6
అక్రమ రవాణా మార్గాలు 60
చిక్కింది కొంతే...
గత మూడేళ్లలో చిక్కింది 1.03 లక్షల కేజీలు
స్వాధీన ఉత్పత్తి విలువ రూ.28.80 కోట్లు
రెండేళ్లలో అరెస్టయిన ఇతర రాష్ట్రాల నిందితులు ఇలా... రాష్ట్రం అరెస్టయినవారు తెలంగాణ 126 ఒడిశా 58 తమిళనాడు 31 మహారాష్ట్ర 41 కర్ణాటక 20 హరియాణా 16 ఉత్తరప్రదేశ్ 25 కేరళ 12 మధ్యప్రదేశ్ 14 రాజసాన్ 5 దిల్లీ 5 ఛత్తీస్గఢ్ 3 పశ్చిమ బంగ 1 పంజాబ్ 1 గుజరాత్ 1
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు