‘ప్రభుత్వ వైఖరిపై ఉద్యమం తప్పదు’
పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఉద్యమిస్తామని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితి(ఏపీ ఐకాస) జిల్లా శాఖ ప్రకటించింది. శనివారం కాకినాడ ఏపీఎన్జీవో భవన్లో ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్ జి.రామ్మోహనరా
మాట్లాడుతున్న ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్ రామ్మోహనరావు, వేదికపై వివిధ సంఘాల ప్రతినిధులు
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఉద్యమిస్తామని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితి(ఏపీ ఐకాస) జిల్లా శాఖ ప్రకటించింది. శనివారం కాకినాడ ఏపీఎన్జీవో భవన్లో ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్ జి.రామ్మోహనరావు అధ్యక్షతన జిల్లా శాఖలో భాగస్వాములైన వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పీఆర్సీలో ఇచ్చిన జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు అదనపు క్వాంటమ్ అమలు చేయాలని, ఒప్పంద, పొరుగుసేవల, కంటింజెంట్ వర్కర్లను క్రమబద్ధీకరించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయిలో ఐకాసలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆదివారం స్థానిక ఏపీఎన్జీవో భవన్లో ఉదయం 10 గంటలకు పీఆర్సీ సాధన సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏపీ ఐకాస జిల్లా కన్వీనర్ డీవీ రాఘవులు, ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి పసుపులేటి శ్రీనివాస్, పాలపర్తి మూర్తిబాబు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్నాథం, ట్రెజరీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాము శ్రీనివాసరావు, జడ్పీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమేశ్, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ జార్జిరాజు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రవిచక్రవర్తి, సుబ్బరాజు, ప్రదీప్కుమార్, లంక జార్జి, వై.వెంకట్రాజు, ఎన్వీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నల్లబ్యాడ్జీలతో విధులకు..
పీఆర్సీ సాధన సమితికి మద్దతుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నట్లు విలేజ్ వార్డు సెక్రటరీయేట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాజేశ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా ఉన్న తమ సంఘంలో సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై, భోజన విరామ సమయంలో నిరసన తెలపాలని పిలుపు నిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ