logo

ట్రాఫిక్‌ మళ్లింపు

కాకినాడ భానుగుడి యతి కూడలి వద్ద ట్రాఫిక్‌ నియంత్రించేందుకు అధికారులు మార్పులు, మళ్లింపులు చేపట్టారు. గతంలో ఆర్టీసీ కాంపెక్స్‌ నుంచి వచ్చే బస్సులన్నీ సేఫ్‌ ఆసుపత్రి మీదుగా భానుగుడి బస్‌స్టాప్‌కు వచ్చేవి. శనివారం నుంచి కోకి

Published : 23 Jan 2022 02:59 IST


భానుగుడి కూడలి వద్ద రోడ్డుకు అడ్డుగా బారికేడ్లు

 

మసీదుసెంటర్‌, న్యూస్‌టుడే: కాకినాడ భానుగుడి యతి కూడలి వద్ద ట్రాఫిక్‌ నియంత్రించేందుకు అధికారులు మార్పులు, మళ్లింపులు చేపట్టారు. గతంలో ఆర్టీసీ కాంపెక్స్‌ నుంచి వచ్చే బస్సులన్నీ సేఫ్‌ ఆసుపత్రి మీదుగా భానుగుడి బస్‌స్టాప్‌కు వచ్చేవి. శనివారం నుంచి కోకిల నుంచి పద్మప్రియ థియేటర్‌ రహదారి గుండా భానుగుడి వంతెన మీదుగా సాగుతున్నాయి. దాంతో భానుగుడి వద్ద ఉన్న బస్‌స్టాప్‌ను మూసివేశారు. నిత్యం అనేకమంది ప్రయాణికులతో కళకల్లాడే బస్టాప్‌ ప్రయాణికులు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. పద్మప్రియ థియేటర్‌ రహదారి నుంచి కోకిల మీదుగా వెళ్లేందుకు లేకుండా ఆ రహదారిని వన్‌వే చేశారు. ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టామని ట్రాఫిక్‌ సీఐ చైతన్యకృష్ణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని