పీఆర్సీ సాధనకు సమష్టి పోరాటం
పీఆర్సీ సాధనకు.. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఐక్య ఉద్యమాలు చేయాలని ఉద్యోగ సంఘాల ఐకాస తీర్మానించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులకు తీవ్ర నష్టదాయకంగా ఉన్న పీఆర్సీ జీవోలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం కాకినాడలోని
చేతులు కలిపి ఐక్యత చాటుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు
కాకినాడ కలెక్టరేట్: పీఆర్సీ సాధనకు.. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఐక్య ఉద్యమాలు చేయాలని ఉద్యోగ సంఘాల ఐకాస తీర్మానించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులకు తీవ్ర నష్టదాయకంగా ఉన్న పీఆర్సీ జీవోలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం కాకినాడలోని ఏపీఎన్జీవో భవన్లో పీఆర్సీ సాధన సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రౌండు టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ ఐకాస జిల్లా ఛైర్మన్, ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జి.రామ్మోహనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. పలు సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. పీఆర్సీ సాధనకు జరిగే పోరాటంలో అవసరమైతే జైలుకు వెళ్లడానికీ సిద్ధంగా ఉండాలన్నారు. కుటుంబాలతో సహా రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రెండు నెలల జీతం రాకపోయినా ఫర్వాలేదని, వాయిదాల చెల్లింపునకు సంబంధించి అవసరమైతే బ్యాంకు అధికారులతో చర్చిద్దామన్నారు. రాష్ట్ర కమిటీ కార్యాచరణ మేరకు జిల్లాలో ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మద్దతు తెలిపారు. ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు, ఏపీ ఐకాస అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ఆర్కే దుర్గాప్రసాద్, ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ సీహెచ్ రవి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీఎస్ఎన్ జగన్నాథం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జిల్లా ఛైర్మన్ పి.వెంకటరత్నం, సంఘాల ప్రతినిధులు పి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాస్, సత్యానందం, ఎం.బాపూజీ, కేవీ సత్యనారాయణ, ఎల్.జార్జి, వి.రవిరాజు, జె.నరసింహరావు, పి.సుబ్బరాజు, రవిచక్రవర్తి, తిలక్బాబు, శాస్త్రి పాల్గొన్నారు.
రేపటి నుంచి నిరసనలు
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు ఉద్యమ కార్యాచరణను పీఆర్సీ సాధన సమితి జిల్లా శాఖ విడుదల చేసింది. 25న జిల్లా కేంద్రంలో ర్యాలీలు, ధర్నాలు, 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాల అందజేత, 27 నుంచి 30 వరకు జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు, వచ్చే నెల 3న చలో విజయవాడ, 5న సహాయ నిరాకరణ, అన్ని ప్రభుత్వ యాప్లను తెరవకపోవడం, 7న సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!