ముచ్చటగా..3
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాలు మూడు జిల్లాలుగా అవ
కొత్త జిల్లాలకు మంత్రివర్గం ఆమోదం
ఈనాడు డిజిటల్ - రాజమహేంద్రవరం: జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాలు మూడు జిల్లాలుగా అవతరించనున్నాయి. గతంలోనే అధికారులు ఆయా జిల్లా కేంద్రాల్లో పాలనకు అనువైన వనరులు, వసతుల కల్పన దిశగా దృష్టి సారించారు. భౌగోళిక స్వరూపం, సరిహద్దుల వివరాలు కూడా ఇప్పటికే అధికారులు నమోదు చేశారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెర మీదకు వచ్చింది. జిల్లాల ఏర్పాటుతోపాటు జిల్లా కేంద్రాల వివరాలు కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంగా ఉండే జిల్లాకు పూర్వ తూర్పుగోదావరి జిల్లా అనే పేరును యథాతథంగా ఉంచారు. అమలాపురం కేంద్రంగా ఆవిర్భవించే జిల్లాకు కోనసీమ జిల్లాగా పేరుపెట్టారు. రాజమహేంద్రవరం పేరును కూడా యథాతథంగా కొనసాగిస్తున్నారు.
వీటిపై దృష్టి అవసరం...
పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా మారుస్తున్న నేపథ్యంలో గతంలోనే ఆయా ప్రాంతాల్లో కలెక్టరేట్ల ఏర్పాటుకు అవసరమైన వనరులు, జిల్లాస్థాయి కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు గుర్తించారు. ఉద్యోగుల వివరాలు, అవసరాలపై నివేదిక సిద్ధం చేశారు. సరిహద్దులు, భౌగోళిక విస్తీర్ణం వివరాలు సేకరించారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్లు, పోలీసు సబ్ డివిజన్లు సమానంగా లేవు. రెవెన్యూ డివిజన్లు ఏడు ఉన్నాయి. జిల్లా ఎస్పీ కార్యాలయం పరిధిలో ఆరు పోలీసు సబ్ డివిజన్లు, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ పరిధిలో నాలుగు జోన్లు ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైతే వీటి సర్దుబాటు దిశగా కసరత్తు చేయాల్సి ఉంది. పాలనా సౌలభ్యం కోసం తమ మండలాలను అనుకూలంగా ఉన్న జిల్లాల్లో చేర్చాలనే వినతులు ప్రజల నుంచి గతంలోనే జిల్లా అధికారులకు అందాయి. తాజా కసరత్తులో భాగంగా వీటిపై దృష్టిసారించాల్సి ఉంది.
కొత్త జిల్లాలపై మీ మాటేంటి?
ఈనాడు - కాకినాడ: ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధంచేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ అభిప్రాయాలను సేకరించారు. జిల్లా నుంచి కలెక్టర్ హరికిరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. గతంలో శాఖల వారీగా సేకరించి పంపిన నివేదిక వివరాలను కలెక్టర్ వెల్లడించారు. కొత్త జిల్లాలపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల తర్వాత అభ్యంతరాల స్వీకరణకు నెలరోజులు గడువు ఇచ్చే వీలుందని కలెక్టర్ హరికిరణ్ ‘ఈనాడు’తో చెప్పారు. అన్నీ పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్