logo

రూ.2 కోట్ల విలువైన..గంజాయి పట్టివేత

రాజమహేంద్రవరం నుంచి నాందేడ్‌కు తరలిస్తున్న రూ.రెండు కోట్ల విలువైన 1,000 కిలోల గంజాయిని బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ రమణకుమార్‌ వివరాల మేరకు... సదాశివపేట మండలం నందికందిలో ఓ టీస్టాల్‌ వద్ద ఆగి ఉన్న లారీలో గంజాయి ఉన్నట్టు విశ్వసనీయ

Published : 27 Jan 2022 04:40 IST

సదాశివపేట, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం నుంచి నాందేడ్‌కు తరలిస్తున్న రూ.రెండు కోట్ల విలువైన 1,000 కిలోల గంజాయిని బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ రమణకుమార్‌ వివరాల మేరకు... సదాశివపేట మండలం నందికందిలో ఓ టీస్టాల్‌ వద్ద ఆగి ఉన్న లారీలో గంజాయి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం రావడంతో స్థానిక పోలీసులు తనిఖీ చేశారు. మహారాష్ట్రలో నాసిక్‌ జిల్లాకు చెందిన షేక్‌ సలీం, అజిత్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు తెలిపారన్నారు. స్థానిక టీ స్టాల్‌ వద్ద సలీం అలియాస్‌ ఆజాద్‌కు కొంత గంజాయిని విక్రయించేందుకు రూ.1.50 లక్షలకు బేరం కుదుర్చుకుని రూ.50 వేలు అడ్వాన్సుగా తీసుకున్నారు. సలీం (ఆజాద్‌) పరారీలో ఉండగా.. మిగితా ఇద్దర్నీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని