గణతంత్రస్ఫూర్తిఘన ప్రగతి దీప్తి
రాజ్యాంగ స్ఫూర్తితో.. దేశ సమైక్యత, సమగ్రత పరిరక్షణకు శ్రమిద్దాం.. సమష్టి భావనతో అన్ని రంగాల్లోనూ తూర్పు ప్రగతికి కృషి చేద్దామని కలెక్టర్ సి.హరికిరణ్ పిలుపునిచ్చారు. బుధవారం కాకినాడ పోలీసు కవాతు మైదానంలో గణతంత్ర దినోత్సవ జిల్లాస్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై.. ఎస్పీ రవీంద్రనాథ్బాబుతో కలిసి
జాతీయ పతాకం ఆవిష్కరిస్తున్న కలెక్టర్. పక్కనే ఎస్పీ
అభివృద్ధి, సంక్షేమం
‘వైఎస్సార్ భరోసా- పీఎం కిసాన్’ ద్వారా ఈ ఏడాది జిల్లాలో 4.54 లక్షల మంది రైతులకు రూ.525 కోట్ల సాయం చేశాం. ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ కింద 71 వేల మందికి రూ.9.41 కోట్లు అందించాం. ‘వైఎస్సార్ యంత్ర సేవా పథకం’ ద్వారా రూ.4.23 కోట్లతో రాయితీపై యాంత్రీకరణ పరికరాలు ఇచ్చాం. రూ.12.62 కోట్లతో ఉద్యాన పంటల విస్తరణ, అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాం. రూ.2.33 కోట్లతో కొబ్బరి తోటలు.. 1,800 హెక్టార్లలో ఆయిల్పామ్ తోటల విస్తరణ చేపట్టాం. ‘వైఎస్సార్ చేయూత’ కింద 6,871 పాడి పశువులను కొని లబ్ధిదారులకు ఇస్తున్నాం. ఉప్పాడ వద్ద రూ.422 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, కాకినాడలో రూ.10 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ చేపట్టాం.
భళారే.. కళా
దేశభక్తిని ప్రతిబింబించేలా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సెయింట్ ఆన్స్, కాకినాడలోని అన్నవరం సత్యవతీదేవి జూనియర్ కళాశాల, సత్యవతీదేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు మేటిగా నిలిచారు. జిల్లా అగ్నిమాపక శాఖ ప్రదర్శన అబ్బురపరిచింది. పరేడ్ కమాండర్ నరసింహమూర్తి సారథ్యంలో సాయుధ బలగాల కవాతు అలరించింది. ఏఎన్ఎస్, మహిళ, ఏఆర్ విభాగాలకు తొలి మూడు స్థానాలు దక్కాయి. శకటాలు.. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ (స్వచ్ఛ సంకల్పం) - ప్రథమ, డీఆర్డీఏ - ద్వితీయ, ఐటీడీఏ (రంపచోడవరం) - తృతీయంగా నిలిచాయి.
పేదలకు గూడు
నవరత్నాలు-పేదలకు ఇళ్లు ద్వారా 3.25 లక్షల కుటుంబాల సొంతింటి కల సాకారం చేయనున్నాం. రూ.3,394 కోట్లతో కాలనీలు వృద్ధి చేస్తున్నాం. సంపూర్ణ గృహ హక్కుతో3.37 లక్షల కుటుంబాలకు ఓటీఎస్ అమలు చేపట్టగా 21,244 మంది వినియోగించుకున్నారు.
పింఛన్లలో ప్రథమం
రాష్ట్రంలో అత్యధికంగా 79,730 మందికి ప్రతీనెలా రూ.171.43 కోట్లు పింఛను సొమ్ము చెల్లిస్తున్నాం. ‘వైఎస్సార్ ఆసరా’ కింద రెండు విడతలుగా 94,670 డ్వాక్రా గ్రూపులకు రూ.1,394 కోట్లు ఇచ్చాం. ‘చేయూత’తో రూ.897 కోట్లు సాయం చేశాం. ‘జగనన్నతోడు’తో 43 వేల చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలిచ్చాం. 1.04 లక్షల డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ రాయితీగా రూ.71.89 కోట్లు చెల్లించాం.
ప్రముఖుల రాక
మంత్రి కన్నబాబు విశిష్ట అతిథిగా హాజరై... శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఉత్తమ ఉద్యోగులు, ప్రతిభా విద్యార్థులకు కలెక్టర్తో కలిసి బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, జడ్పీ ఛైర్మన్ వేణుగోపాలరావు, మేయర్ శివప్రసన్న, కుడా ఛైర్మన్ చంద్రకళాదీప్తి, స్మార్ట్సిటీ కార్పొరేషన్ ఛైర్మన్ రాజుబాబు, ఎస్పీ రవీంద్రనాథ్బాబు, జేసీలు సుమిత్, కీర్తి, భార్గవ్తేజ, కమిషనర్లు స్వప్నిల్, అభిషిక్త్కిశోర్, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఏఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అధికార గణం: కలెక్టర్, ఎస్పీతో జేసీలు, కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు
సగర్వం: ఆకట్టుకున్న పోలీసు కవాతు
ఆతిథ్యం:జేసీ సుమిత్, మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ పండుల, జడ్పీ ఛైర్మన్ విప్పర్తి
ప్రథమ శకటం: కాకినాడ కార్పొరేషన్.. స్వచ్ఛ సంకల్పం
వర్ణ శోభితం: అలరించిన అగ్నిమాపక శకట విన్యాసం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
[ 20-04-2024]
చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు.. -
జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం: పురందేశ్వరి
[ 20-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిసితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
వెంకన్న కల్యాణం.. కల్యాణ క్రతువు
[ 20-04-2024]
కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. -
నేడు కోరుకొండలో వారాహి విజయభేరి సభ
[ 20-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో శనివారం నిర్వహించనున్న వారాహి విజయభేరి బహిరంగసభలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న ఆయన జిల్లాలోని జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. -
పడలేదు పునాది.. పారిశ్రామికం సమాధి
[ 20-04-2024]
పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం ఉంది. గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి ఏపీఐఐసీ పార్కులో రూ.270 కోట్లతో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు భూముల కేటాయింపు, అన్ని అనుమతులు ఆరు నెలల్లోనే ఇచ్చాం. -
కొనసాగిన నామినేషన్ల సందడి
[ 20-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో రెండో రోజే నామినేషన్ల దాఖలు సందడి కొనసాగింది. -
వైకాపా నాయకుల పథకం.. వాలంటీర్లు ప్రచారం!
[ 20-04-2024]
వైకాపా నాయకుల ఒత్తిళ్లతో కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంటే మరి కొంతమంది రాజీనామాలు చేయకుండానే ప్రచారం చేస్తున్నారు. -
రూ.8.73 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 20-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లొస్తుండగా ప్రమాదం
[ 20-04-2024]
హోంమంత్రి నామినేషన్ ర్యాలీకి వెళ్లిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై తిరిగొస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. -
జగన్ సిద్ధం.. ప్రయాణాలు నిషిద్ధం
[ 20-04-2024]
ఆర్టీసీ కాంప్లెక్స్లలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించినా ఒక్క బస్సు వస్తే ఒట్టు.. మరోవైపు సిద్ధం సభకు గ్రామాలకు పెద్దసంఖ్యలో బస్సులు కేటాయించినా కొన్ని ఖాళీగా.. మరికొన్ని ముగ్గురు, నలుగురు ప్రయాణికులతో వెళ్లాయి. -
వైద్యరంగానికి ఇదేనా పెద్దపీట
[ 20-04-2024]
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అరుదైన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల పట్ల కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
[ 20-04-2024]
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
జిల్లాలో రెండోరోజు 12 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండోరోజు శుక్రవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఇళ్లకు వెళ్లడం ఎలా?
[ 20-04-2024]
సిద్ధం సభకు పలు జిల్లాల నుంచి వెయ్యికిపైగా బస్సులు ఏర్పాటుచేశారు. జనాన్ని తీసుకొచ్చినప్పుడు చూపిన శ్రద్ధ తిరుగు ప్రయాణంలో చూపకపోవడంతో సభ సాయంత్రం 6.30 గంటలకు ముగిసినా.. బస్సుల కోసం రాత్రి 10 గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. -
సమగ్ర వ్యయ పర్యవేక్షణకు చర్యలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులపై సమగ్ర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?