logo

8,478 క్రియాశీలక కేసులు.. మరో ఇద్దరి మృతి

గత 24 గంటల్లో జిల్లాలో 961 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి చికిత్స పొందుతూ బుధవారం ఇద్దరు మృతి చెందారు. దీంతో మూడో దశలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. మొత్తంగా ఇప్పటివరకు 1296 మంది మృతి చెందగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,04,658కి చేరింది. 2,94,884 మంది కో

Published : 27 Jan 2022 04:40 IST

మసీదుసెంటర్‌(కాకినాడ): గత 24 గంటల్లో జిల్లాలో 961 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి చికిత్స పొందుతూ బుధవారం ఇద్దరు మృతి చెందారు. దీంతో మూడో దశలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. మొత్తంగా ఇప్పటివరకు 1296 మంది మృతి చెందగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,04,658కి చేరింది. 2,94,884 మంది కోలుకోగా, ప్రస్తుతం 8,478 క్రియాశీలక కేసులున్నాయని అధికారులు పేర్కొన్నారు.

5,326 మందికి టీకాలు: జిల్లాలో 15 నుంచి 17 ఏళ్ల పిల్లలు, ముందుజాగ్రత్త డోసు, మొదటి, రెండో డోసులన్నీ కలిపి 5,326 మందికి కొవిడ్‌ నివారణ టీకాలు వేసినట్లు బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని