భిన్న జిల్లాలు.. విభిన్న స్వరాలు
జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా మంత్రివర్గ ఆమోదంతో కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ప్రజల దృష్టి కొత్త జిల్లాల ఏర్పాటుపై పడింది. జిల్లాలోని కాకినాడ, కోనసీమ (అమలాపురం), తూ.గో.(రాజమహేంద్రవరం) నూతన జిల్లాలుగా ఆవిర్భవించనున్నాయి. విభజన నేపథ్యంలో గ
ఈనాడు డిజిటల్ - రాజమహేంద్రవరం: జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా మంత్రివర్గ ఆమోదంతో కొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ప్రజల దృష్టి కొత్త జిల్లాల ఏర్పాటుపై పడింది. జిల్లాలోని కాకినాడ, కోనసీమ (అమలాపురం), తూ.గో.(రాజమహేంద్రవరం) నూతన జిల్లాలుగా ఆవిర్భవించనున్నాయి. విభజన నేపథ్యంలో గతంలోనే వెలుగు చూసిన సమస్యలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. వీటిలో భౌగోళిక సమస్యలు, దూరాభారాలు, విలీన మండలాల ఇబ్బందులు ప్రధానంగా ఉన్నాయి.
విలీన వేదన...
మన్యంలోని వీఆర్పురం, చింతూరు, కూనవరం, ఎటపాక మండలాలు 1953లో తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవి. వీటిని పాలన సౌలభ్యం కోసం 1959లో ఖమ్మం జిల్లాలో కలిపారు. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేశారు. తాజాగా పాడేరు జిల్లాలో కలుపుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. విలీన మండలాలే కాకుండా రంపచోడవరం, చింతూరు రెండు ఐటీడీఏల పరిధిలోని 11 మండలాలను పాడేరులో కలపటంతో దూరం పెరిగిపోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. చింతూరు, రంపచోడవరం నుంచి పాడేరు 280 కి.మీ. దూరంలో ఉంది. ఎటపాక 345 కి.మీ దూరంలో ఉంది. దీంతో జిల్లా కేంద్రానికి వెళ్లటానికి చాలా ఇబ్బందే అని మన్యంవాసుల వేదన. మన్యంలోని 11 మండలాలను జిల్లాగా ఏర్పాటు చేయాలి లేదా రాజమహేంద్రవరంలో కలపాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది.
ఎవరి ఆశలు వారివి..
రామచంద్రపురం నియోజకవర్గం అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నా అమలాపురానికి దాదాపు 60 కి.మీ దూరంలో ఉంది. కాకినాడకు కేవలం 30 కి.మీ దూరంలో ఉన్నందున కాకినాడ జిల్లాలో కలిపితే సౌకర్యంగా ఉంటుందని గతం నుంచి డిమాండ్ ఉన్నా.. తాజాగా అమలాపురంలోనే కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో మరోసారి చర్చలు మొదలయ్యాయి. కొందరు మాత్రం కోటిపల్లి వంతెన నిర్మాణం జరిగితే అమలాపురం కూడా దగ్గరవుతుందని చెబుతున్నారు.
అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి మండలాన్ని కూడా కాకినాడలో చేర్చాలనే డిమాండ్ ఉంది. ఈ మండలంలో 18 గ్రామాలకు రాజమహేంద్రవరం కంటే.. కాకినాడలో ఉంటేనే సౌలభ్యంగా ఉంటుంది. ఈ మండలంలోని రామేశ్వరం కాకినాడకు కేవలం 5 కి.మీ దూరంలో ఉంటే... రాజమహేంద్రవరానికి 80 కిమీ దూరంలో ఉంది.●
తాళ్లరేవు కాకినాడ రెవెన్యూ డివిజన్లో ఉంది. అమలాపురం పార్లమెంటు పరిధిలోనూ ఉన్నందున.. కోనసీమ జిల్లాలోకి వచ్చింది. ఈ మండలం కాకినాడకు కేవలం 12 కి.మీ దూరంలో ఉంది. కాకినాడ జిల్లాలో కలిపితే సౌలభ్యంగా ఉంటుందనే వాదన వినిపిస్తోంది. అదే అమలాపురంలో అయితే 40కి.మీ దూరం. ఈ అంశంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, అఖిలపక్షంగా ఏర్పడ్డాయి.
రెవెన్యూ, పోలీసుపరంగా గోకవరం రాజమహేంద్రవరం డివిజన్లోనే ఉంది. పార్లమెంట్ నియోజకవర్గం ప్రకారం కాకినాడలో ఉన్నందున ప్రస్తుతం కాకినాడ జిల్లాలో కలవనుంది. గోకవరానికి రాజమహేంద్రవరానికి 30 కి.మీ మాత్రమే. గోకవరం ప్రజలు అన్ని పనులకు రాజమహేంద్రవరమే వెళతారు. కాకినాడ వెళ్లాలంటే 65 కి.మీ ప్రయాణం తప్పదు.
అభ్యంతరాలు తెలిపే అవకాశం
జిల్లాల పునర్విభజనకు సంబంధించి రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ఆయా ప్రాంతాల ప్రజలకు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ కొనసాగుతుందనే విషయంపై ఇంకా ఆదేశాలు రాలేదు. ఒకటి రెండు రోజల్లో స్పష్టత వస్తుంది. -హరికిరణ్, కలెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?