logo

AP News: దంపతుల మధ్య గొడవ.. భర్తపై వేడి పులుసు పోసిన భార్య

భార్యాభర్తల వివాదం తారస్థాయికి చేరి చివరకు సలసల మరిగే పులుసు భర్త ముఖంపై పోసేసింది ఆ ఇల్లాలు. తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సామర్లకోటలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలి

Updated : 28 Jan 2022 10:03 IST


చికిత్సపొందుతున్న ప్రసాద్‌

సామర్లకోట: భార్యాభర్తల వివాదం తారస్థాయికి చేరి చివరకు సలసల మరిగే పులుసు భర్త ముఖంపై పోసేసింది ఆ ఇల్లాలు. తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సామర్లకోటలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక బళ్లమార్కెట్‌ సెంటర్‌ భీమవరంపేటకు చెందిన కొల్లి ప్రసాద్‌, అమ్మాజీ భార్యాభర్తలు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇరువురి మధ్య గురువారం వివాదం జరిగి అది కాస్త పెద్దదైంది. ఆ సమయంలో వంట చేస్తున్న అమ్మాజీ మరిగే పులుసు భర్త ముఖంపై పోసింది. దీంతో ప్రసాద్‌ ముఖం కాలిపోయి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు సామర్లకోట ఇన్‌ఛార్జి ఎస్సై సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు