దండాలెట్టే వారే.. దయతలిచే వారేరీ?
గోదావరి.. దేశంలో రెండో పెద్ద నది.. దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల జీవనాడి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న గోదావరి పరిస్థితి పేరుకే గొప్ప.. అనే చందాన తయారైంది. జీవనది కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. పుష్కర ఘాట్లు అపరిశుభ్రతకు నెలవులుగా మారి కాలుష్య కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. నగరంలో మురికినీరు నేరుగా గోదావరిలో కలవడం
ఈనాడు డిజిటల్ - రాజమహేంద్రవరం, న్యూస్టుడే - రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
గోదావరి.. దేశంలో రెండో పెద్ద నది.. దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల జీవనాడి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న గోదావరి పరిస్థితి పేరుకే గొప్ప.. అనే చందాన తయారైంది. జీవనది కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. పుష్కర ఘాట్లు అపరిశుభ్రతకు నెలవులుగా మారి కాలుష్య కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. నగరంలో మురికినీరు నేరుగా గోదావరిలో కలవడం, పేరుకుపోయిన వ్యర్థాలను నెలల తరబడి తొలగించకపోవటంతో కాలుష్యం కరాళనృత్యం చేస్తోంది. గోదావరి కాలుష్యం నివారణకు తలపెట్టిన నమామి గోదావరి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.
నల్లా ఛానల్ ద్వారా గోదావరిలో కలుస్తున్న మురుగు
సగమే శుద్ధి..
రాజమహేంద్రవరం నగర జనాభా... 4.5 లక్షలు. నగరం చుట్టూ 50కి పైనే పరిశ్రమలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల నుంచి రోజుకు 60 ఎంఎల్డీ మురుగు విడుదలవుతోంది. దానికి పారిశ్రామిక వ్యర్థాలు తోడవడం సమస్యగా మారింది. ఆవ ఛానల్ దగ్గర కేవలం 30 ఎంఎల్డీ ఎస్టీపీ ప్లాంట్ (మురుగునీటి శుద్ధీకరణ వ్యవస్థ) మాత్రమే ఉంది. మిగిలిన నీరు నల్లా ఛానల్ ద్వారా నదిలో కలుస్తోంది. దీంతో రోజుకు 30 ఎంఎల్డీ మురుగు నీరు సరాసరి గోదావరిలో కలిసి కాలుష్యం పెరుగుతోంది.
ముప్పన్నా.. ఉలకరే
గత పుష్కరాల వేళ జాతీయ కాలుష్య నియంత్రణ మండలి గోదావరిని పరిశీలించింది. నగరంలోని మురుగు నేరుగా నదిలో కలవడంతో కాలుష్య ముప్పు ఉంటుందని, మురుగు వచ్చే కాలువ వ్యవస్థను మెరుగుపరచాలని నివేదించింది. ఈ తరుణంలో నమామి గోదావరి ప్రాజెక్టులº మొదటి విడతలో కాలువల వ్యవస్థ ఆధునికీకరణతోపాటు.. మురుగును శుభ్రం చేసి నదిలో వదిలేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నగర భావి అవసరాల దృష్ట్యా ప్రస్తుత ఎస్టీపీకి అదనంగా.. 2021 నాటికి 40 ఎంఎల్డీ, 2030 నాటికి 60 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీలు నిర్మించాలన్న ప్రణాళిక గతంలో రచించినా కదలిక లేదు.
ప్రణాళికలే... పైసలు లేవు
పుష్కర ఘాట్ ఎగువన నదిలో కలుస్తున్న మురుగు
పూర్తిస్థాయిలో కాలుష్య నివారణ చేయాలంటే ఆవ ఛానల్ వద్ద ఎస్టీపీ ప్లాంట్ను ఆధునికీకరించాలి. మరోవైపు నగరంలో మురుగు నేరుగా నదిలో కలవకుండా పైపులైన్లను ఎనిమిది జోన్లుగా విభజించారు. ఆయా జోన్లలో కాలువలను విస్తరించాల్సి ఉంది.. వరద నీటిని స్టోరేజీ చేసేందుకు కంబాలచెరువు వద్ద పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో కాతేరు, వీఎల్పురం, కోటిపల్లి బస్టాండ్ తదితర ప్రాంతాల మీదుగా వచ్చే మురుగును మళ్లించేందుకు కాలువల వ్యవస్థను మెరుగుపరచాలి.
ఆవ విస్తరణే కీలకం
ప్రధానంగా ఆవ కాలువ విస్తరణతో ధవళేశ్వరం దాటాకే మురుగు కలిసే ఏర్పాటు చేయాలి. ఈ పనుల కోసం నమామి గోదావరి పేరుతో నదీ స్వచ్ఛతకు నిధులు కేటాయించింది. మొత్తం రూ.400 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదించింది. తొలిగా రూ.వంద కోట్ల విడుదలకు అంగీకరించింది. దీంతో అధికారులు 87.16 కోట్లతో పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసినా.. డబ్బులు చేతికి రాలేదు.
నిర్వహణకు నీళ్లొదిలారు...
గోదావరి శుభ్రత విషయంలో వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే ఘాట్లు అపరిశుభ్రతకు నెలవుగా మారాయి. చెత్త, చెదారంతో నిండిపోయాయి. పర్వదినాల సమయంలో కూడా కనీసం శుభ్రం చేయటం లేదని భక్తులు వాపోతున్నారు. ప్రధానంగా గౌతమ, కోటిలింగాల ఘాట్లలో పరిశుభ్రతను గాలికొదిలేశారు. ఈ మురికి నీటిలోనే భక్తులు స్నానాలు చేస్తున్నారు. జల వనరుల శాఖ, నగరపాలక శాఖ రెండూ నిర్వహణను పట్టించుకోవటం లేదు. వెరసి మురుగు తొలగక.. నిర్వహణ లేక కాలుష్యంతో కునారిల్లుతున్నాయి.
చిక్కుల్లో ప్రజారోగ్యం..
వ్యర్థాలు- వ్యర్థ జలాల నిర్వహణ నిబంధనలు- 2016 జిల్లాలో పాలికలు.. పంచాయతీలూ పాటించడంలేదు. పరిస్థితి చక్కదిద్దాలని ఎన్జీటీ హెచ్చరిస్తున్నా కదలికలేదు. కాలుష్య నియంత్రణ మండలి నామమాత్ర తాఖీదులకు స్థానిక సంస్థలు స్పందించడంలేదు. పరిశ్రమలు, వ్యవసాయ, రసాయన కాలుష్య జలాలు.. నల్ల, ఆవ, ఏలేరు, పిఠాపురం, తుల్యభాగ, వృద్ధగౌతమి, శుద్ధగడ్డ, తిమ్మరాజు చెరువు ఇలా వివిధ పాయలు కాలువల ద్వారా గోదావరిలో కలిసి ప్రజారోగ్యం దెబ్బతింటోంది.
శుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం
గోదావరి కాలుష్యం, ఘాట్ల అపరిశుభ్రతపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించాను. నమామి గోదావరి నిధులు త్వరలో విడుదలవుతాయి. నిధులు వచ్చిన వెంటనే పనులు మొదలు పెడతాం. అన్ని ఘాట్ల నిర్వహణపై కూడా దృష్టిపెడతాం. పర్వదినాలతో సంబంధం లేకుండా శుభ్రంగా ఉంచుతాం.
- కె.మాధవీలత, కలెక్టర్, తూ.గో.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.