‘తెర’పడని కష్టాలు
సినీ పరిశ్రమను కష్టాలు వెంటాడుతున్నాయి. నిన్న.. మొన్నటి వరకు కొవిడ్ ఉద్ధృతి కారణంగా ప్రదర్శనలు నిలిచిపోయాయి. తీరా పరిస్థితి సద్దుమణిగిన తరువాత కొత్త నిబంధనలు అమలు.. టికెట్ల ధరల తగ్గింపుతో థియేటర్ల
గాంధీనగర్, రామచంద్రపురం, న్యూస్టుడే: సినీ పరిశ్రమను కష్టాలు వెంటాడుతున్నాయి. నిన్న.. మొన్నటి వరకు కొవిడ్ ఉద్ధృతి కారణంగా ప్రదర్శనలు నిలిచిపోయాయి. తీరా పరిస్థితి సద్దుమణిగిన తరువాత కొత్త నిబంధనలు అమలు.. టికెట్ల ధరల తగ్గింపుతో థియేటర్ల యాజమాన్యాలు కుదేలయ్యాయి. తాజాగా ప్రభుత్వం ఆన్లైన్లో ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్ల అమ్మకాలు చేయాలని ఒప్పందం కోసం ప్రయత్నిస్తుండటం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైందని థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వాపోతున్నారు.
నష్టాల నుంచి గట్టెక్కకుండానే..
కొవిడ్ వేళ లాక్డౌన్తో సినిమాల విడుదల ఆగింది. థియేటర్లు మూతపడి వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు.అనంతరం థియేటర్లు తెరిచినా కొవిడ్ నిబంధనల పేరుతో 50 శాతం ఆక్యుపెన్సీతో నష్టాల్లో నడిచాయి. ఈ పరిస్థితుల్లో టికెట్ల ధరలు తగ్గించడంతో ఉక్కిరిబిక్కిరైన యజమానులు థియేటర్లను మూసివేశారు. అనంతరం జరిగిన చర్చల్లో కొంత మేర పెంచి ఊరట కల్పించినా మళ్లీ ఇప్పడు కొత్తగా జీవో తెచ్చి తమ ఆధ్వర్యంలోనే టికెట్ల అమ్మకాలు జరగాలని చెప్పడం థియేటర్ల యజమానులను కలవరపెడుతోంది.
టికెట్ల డబ్బులు ఎప్పుడిస్తారో..
రాష్ట్ర చలనచిత్ర అభివృద్ది మండలి ఆధ్వర్యంలో సినిమా టికెట్లను ఆన్లైన్లో అమ్మడం సరే, అమ్మిన టికెట్ల డబ్బులు ఎప్పుడు తిరిగిస్తారోనని వారు వాపోతున్నారు. ఇవాళ టికెట్లు అమ్మితే తర్వాత రోజు సొమ్మును థియేటర్ల ఖాతాల్లో జమ చేస్తామన్నా సంశయిస్తున్నారు. కాకినాడ జిల్లాలో 45, కోనసీమ జిల్లాలో 56, తూ.గో. జిల్లాలో 33 థియేటర్లకు సొమ్ములు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండిపోతాయనీ, తాము వ్యాపారం చేసేదెలాగని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీఎఫ్డీసీ రూపొందించిన ఎంవోయూలపై సంతకాలు చేయాలని ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులపై ఒత్తిడి పెరిగింది. జూన్ 2న ఇచ్చిన జీవో, దానికి అనుబంధంగా ఒప్పందం రూపొందించి సంతకాలు చేయాలని చెప్పడంపై ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. థియేటర్ నిర్వహణకు రోజువారీ ఖర్చులుంటాయని, ఆన్లైన్లో జమైన మొత్తం ఒకవేళ నిలిచిపోతే సమస్యలు తప్పవని చెబుతున్నారు.
సమస్య పరిష్కరించాలని వినతి
ఆన్లైన్ టికెట్ల వ్యవహారంపై ఉన్న నిబంధనలు, ఎంవోయూలపై చేస్తున్న ఒత్తిడిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించిన ఉమ్మడి జిల్లాలోని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు సోమవారం రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఎంవోయూలపై అధికారులు తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, నిబంధనలు పూర్తిగా ఎఫ్డీసీకి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు చేస్తే ముందురోజు అమ్మకాల సొమ్ము తరువాత రోజున జమ చేస్తామంటున్నారని వీటిపై తమకు స్పష్టత లేనందున పునః సమీక్షించాలని కోరినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ.114 కోట్లు.. అప్పులు రూ.64 కోట్లు
[ 23-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. -
నామినేషన్ వేసిన పవన్.. అఖండ విజయం ఎన్డీయేదేనని ధీమా
[ 23-04-2024]
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. -
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి