పారదర్శకంగా బదిలీల ప్రక్రియ
ఉమ్మడి జిల్లా పరిషత్తు పరిధిలో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేశామని జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. జడ్పీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుక్రవారం అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు. జడ్పీ
ఎంపీడీవో ఝాన్సీకి ఉత్తర్వులు అందజేస్తున్న జడ్పీ ఛైర్మన్
కాకినాడ నగరం: ఉమ్మడి జిల్లా పరిషత్తు పరిధిలో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేశామని జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. జడ్పీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుక్రవారం అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు. జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ జడ్పీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలు, పాఠశాలలు, ఇంజినీరింగు విభాగాల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులు కలిపి 476 మందికి బదిలీలు చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో 14 మంది ఎంపీడీవోలు ఉన్నారన్నారు. జడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ అయిదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న అందరికీ బదిలీలు కల్పించామన్నారు. జడ్పీ డిప్యూటీ సీఈవో నారాయణమూర్తి, పాలనాధికారి సుబ్బారావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, పాల్గొన్నారు.
దేవాదాయ శాఖలో...
గాంధీనగర్: దేవాదాయ శాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. ఈవోలకు కమిషనర్ కార్యాలయంలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయ ఉద్యోగులు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు డీసీ కార్యాలయంలో ప్రక్రియ నిర్వహించారు. 73మంది ఈవోలకు స్థానచలనం కల్పించారు. 6బీ పరిధిలోకి వచ్చే ఆలయాలు, సత్రాల్లో పనిచేసే ఉద్యోగులు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను బదిలీలు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ అసిస్టెంట్లు 7, జూనియర్ అసిస్టెంట్ 45మందిని బదిలీ చేశారు. కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన జాబితా ప్రకారం 6ఏ పరిధిలో ఆలయాలు, సత్రాల్లో ఉమ్మడి జిల్లాలో సూపరింటెంటెంట్లు 11మంది, జూనియర్ అసిస్టెంట్లు 30, సీనియర్ అసిస్టెంట్ల 30, రికార్డు అసిస్టెంట్లు 11మందికి స్థానచలనం కల్పించారు.
విద్యుత్తు శాఖలో...
టి.నగర్: విద్యుత్ శాఖలో విశాఖ కార్పొరేట్ కార్యాలయం డీఈఈగా ఉన్న ఏవీ శివ కుమార్ను రాజమహేంద్రవరం ట్రాన్స్కో క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా బదిలీ చేశారు. ఇక్కడ డీఈఈ కమర్షియల్గా ఉన్న పి.సన్యాసిరావును అనపర్తి డీఈఈగా బదిలీ చేశారు. రాజమహేంద్రవరం పట్టణ-2 డీఈఈగా ఉన్న పీబీ నటరాజన్ జంగాను పిఠాపురం డీఈఈగా పంపించారు. బొమ్మూరు ప్రొటెక్షన్-1లో డీఈఈగా ఉన్న బి.సూర్యనారాయణను జగ్గంపేట డీఈఈగా బదిలీ చేశారు. రాజమహేంద్రవరంలో ఈఈ(ఎంఅండ్పీ)గా ఉన్న కె.రత్నాలరావును జగ్గంపేట ఈఈగా బదిలీ చేశారు. కాకినాడ ఈఈ(ఓ)గా ఉన్న ఎన్.ఉదయ్భాస్కర్ను రాజమహేంద్రవరం ఈఈ(ఎంఅండ్పీ) విభాగానికి పంపించారు. జగ్గంపేట ఈఈ(ఓ)గా ఉన్న ఏనుగుపల్లి డేవిడ్ను రాజమహేంద్రవరం ఈఈగా బదిలీ చేశారు.
రెవెన్యూలో తెగని పంచాయితీ
కాకినాడ కలెక్టరేట్: రెవెన్యూశాఖలో బదిలీ పంచాయితీ కొనసాగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలతో బదిలీ గడువు ముగిసినా, శుక్రవారం రాత్రి వరకు ఈ క్రతువు సాగింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి తహసీల్దార్లు, ఉపతహసీల్ధార్లు, వీఆర్వో, సీనియర్, జూనియర్ సహాయకులు, ఆఫీసు సబార్డినేట్స్ బదిలీల ప్రక్రియను కాకినాడ కలెక్టరేట్ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. వీటిలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీల ఆప్షన్ ఇచ్చిన వారికి ఇక్కడి నుంచే ప్రక్రియ పూర్తి చేస్తాయి. జిల్లాల స్థాయిలో బదిలీలు కోరుకునే వారికి మిగతా మూడు జిల్లాల కలెక్టర్లు దీన్ని నిర్వహించాలి. వాటిలో కూడా ఇప్పటికీ బదిలీల ప్రక్రియ పూర్తికాలేదు. దీనంతటికీ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే సిఫార్సు లేఖలు కారణంగా నిలుస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరంలో నూతన ధ్వజస్తంభ పనులకు శ్రీకారం
[ 28-03-2024]
అన్నవరం దేవస్థానంలో అనివేటి మండపంలో బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి గురువారం శ్రీకారం చుట్టారు. -
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు