‘బొండు ఇసుక పేరుతో ఇదేం దోపిడీ’
అనుమతులు లేకుండా గోదావరి నదీగర్భంలో ఇసుక తవ్వకాలు చేసి ఇతర జిల్లాలకు రవాణా చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని తవ్వకాలు చేసే చోటుకు వెళ్లేందుకు వచ్చిన తెదేపా బృందాన్ని శుక్రవారం ఉదయం పోలీసులు
తెదేపా బృందంతో మాట్లాడుతున్న డీఎస్పీ, తదితరులు
సీతానగరం, న్యూస్టుడే: అనుమతులు లేకుండా గోదావరి నదీగర్భంలో ఇసుక తవ్వకాలు చేసి ఇతర జిల్లాలకు రవాణా చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని తవ్వకాలు చేసే చోటుకు వెళ్లేందుకు వచ్చిన తెదేపా బృందాన్ని శుక్రవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. నదీగర్భంలో ఉన్న అక్రమ తవ్వకాలను ఆధారాలతో సహా చూపిస్తామంటూ తమతోపాటు పోలీసులు కూడా లోపలకు రావాలని బృందం కోరినా పోలీసు యంత్రాంగం అంగీకరించలేదు. సీతానగరం మండలంలోని కాటవరం రేవులో గతేడాది ఉమ్మడిజిల్లాగా ఉన్నప్పుడు కలెక్టర్ ఇచ్చిన బొండు ఇసుక రవాణాకు సంబంధించిన ఆదేశాలతో ప్రస్తుత సీతానగరం తహసీల్దార్ తెల్లకాగితంపై ఇచ్చిన అనుమతితో ఇసుకను విశాఖపట్నానికి ఎలా రవాణా చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తెదేపా శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. అప్పటికే ఉత్తరమండల డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రేవు లోపలకు వెళ్లడానికి వీలులేదంటూ నిరోధించడంతో రోడ్డుపైనే ఆందోళనకారులు ఉండిపోయారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణాల పేరుతో ఇసుకను అడ్డుగోలుగా దోచేస్తున్నారన్నారు. పునాదుల్లో వేసేందుకు ఉపయోగించే బొండు ఇసుక రవాణా చేస్తుంటే 30 టన్నుల బరువుతో వెళ్లే లారీలకు జేపీ వెంచర్స్ స్లిప్లు ఎందుకు పంపిణీ చేస్తున్నారన్నారు. గనులశాఖ నుంచి తవ్వకాలకు అనుమతులు లేకుండా ప్రైవేటు భూముల్లో ప్రైవేటు వ్యక్తులు దందా చేసి అడ్డుగోలుగా దోచేయడం ఆధారాలతో సహా చూపిస్తామంటూ తామంతా వచ్చినా రేవులోకి వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారన్నారు. ఆర్ఐ గంగరాజు, వీఆర్వో అఖిల్ సంఘటనా స్థలానికి వచ్చి గతేడాది అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ బొండు ఇసుక రవాణా చేసుకునేలా అనుమతులిచ్చారన్నారు. అయితే అప్పట్లో గోదావరికి వరద రావడం వల్ల ఇసుకను తవ్వలేదన్నారు. ఆ ఆదేశాలను అనుసరించే ప్రస్తుత సీతానగరం తహసీల్దారు ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక రవాణాకు ఆదేశాలు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యేకు వివరించే ప్రయత్నం చేశారు. అనంతరం కలెక్టర్ మాధవీలతను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు చిట్టూరి రంగారావు, కాండ్రు శ్రీనివాసరావు, గద్దే సురేష్, గూడపాటి శ్రీనివాసు, దాసరి కోటేశ్వరరావు, బండి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.