కుట్లు..పచ్చ నోట్లు
రాజమహేంద్రవరం, న్యూస్టుడే: అదేంటో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువ సంఖ్యలో ఉంటే.. ప్రైవేటు హాస్పిటళ్లలో మాత్రం సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ మర్మమేంటో తెలియక సామాన్యులు తికమకపడుతుంటారు..
రాజమహేంద్రవరం, న్యూస్టుడే: అదేంటో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువ సంఖ్యలో ఉంటే.. ప్రైవేటు హాస్పిటళ్లలో మాత్రం సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ మర్మమేంటో తెలియక సామాన్యులు తికమకపడుతుంటారు.. సాధారణంగా నగదు చెల్లించే సేవలు నాణ్యమైనవిగా ఉంటాయని నమ్ముతారు.. అందుకే డబ్బులు ఖర్చయినా, సురక్షిత వైద్య సేవలు అందుతాయని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తారు.. తీరా అక్కడ చాలా కేసుల్లో కత్తెరకే పని చెబుతున్నారు. సిజేరియన్లు చేయడంలో ఎప్పటికప్పుడు వారి రికార్డులను వారే తిరగరాస్తున్నారు.
కత్తెరకే మొగ్గు..
2021-22 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రసవాలకు సంబంధించిన గణాంకాలు చూస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది. ఉమ్మడి జిల్లాలో ఏటా 60 నుంచి 80 వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడ సీహెచ్సీ, పీహెచ్సీ, యూపీహెచ్సీ, ఏరియా ఆసుపత్రి, జీజీహెచ్ కలిపి 190 ప్రభుత్వాసుపత్రులు ఉన్నాయి. వసతులు మెరుగవ్వడంతో ఇక్కడకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. 2021-22లో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 33,934 కాన్పులు జరిగితే అందులో 66.5 శాతం సాధారణ ప్రసవాలే. అత్యవసరమైతేనే ఇక్కడి వైద్యులు శస్త్రచికిత్స వైపు మొగ్గు చూపారు.
కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్న సందర్భాల్లో సైతం సిజేరియన్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,064 ప్రైవేటు ఆసుపత్రులుంటే.. అందులో మూడు వందల వరకు గైనిక్ సేవలు అందజేసేవి ఉన్నాయి. వీటిలో 2021-22లో 39,478 ప్రసవాలు జరిగితే అందులో 62.8 శాతం సిజేరియన్లే ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ ప్రసవమైతే తక్కువ రుసుములుంటాయి కాబట్టి.. శస్త్రచికిత్సల వైపు మొగ్గుతున్నారు. ఒక్కో సిజేరియన్కు రూ.50వేల నుంచి రూ.లక్ష తీసుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు గది అద్దె, మందులు, ఇతర ఖర్చులు అదనంగా వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రసవమైతే రెండు రోజుల్లో డిశ్ఛార్జి అవుతారు. శస్త్రచికిత్సకు కనీసం వారం ఆసుపత్రిలో ఉండాల్సిందే.. కాబట్టి ఎక్కువ మొత్తం బిల్లులకు అవకాశం ఉంటుంది. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ల సంఖ్య పెరుగుతోంది. పర్యవేక్షణ లేక ఏ వైద్య సేవకు ఎంత ఖర్చు అవుతుందో డిస్ప్లే బోర్టులపై ప్రదర్శించాలన్న నిబంధన పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.
చర్యలు తీసుకుంటాం..
ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్దేశించిన రుసుములే వసూలు చేయాలి. కొన్ని ఆసుపత్రుల్లో ఫీజులు భారీగా తీసుకుంటున్నారని తెలిసింది. వారిపై చర్యలు తీసుకుంటాం. అవసరం లేకున్నా సిజేరియన్లు చేయడం సరికాదు. బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. -డాక్టర్ రమేష్, ఇన్ఛార్జి డీఎంహెచ్వో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే పథకాల అమలు
[ 18-04-2024]
సైకో పాలనతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రానున్న రోజుల్లో కూటమి విజయం సాధించి ఎన్నోసంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చాగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య అన్నారు. -
యువకుని ఆత్మహత్య
[ 18-04-2024]
ఆత్రేయపురం మండలం, రాజవరం గ్రామానికి చెందిన ఓ యువకుడు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. -
తెదేపాలో పలువురి చేరిక
[ 18-04-2024]
మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. -
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
[ 18-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
[ 18-04-2024]
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. -
చెప్పారంటే.. చేయరంతే!
[ 18-04-2024]
ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, -
అడ్డగోలుగా తవ్వేయ్.. అడ్డదారిలో అమ్మేయ్..
[ 18-04-2024]
అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. -
వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!
[ 18-04-2024]
ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. -
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
[ 18-04-2024]
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
తుంచేసిన కల.. కూత వినబడేదెలా
[ 18-04-2024]
దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. -
హామీల గారడి.. కోనసీమకు బురిడీ
[ 18-04-2024]
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. -
దళితులపై దాడులు చేసేవారికి జగన్ పదోన్నతులు
[ 18-04-2024]
దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. -
పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి
[ 18-04-2024]
రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ డిమాండ్ చేశారు. -
అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు
[ 18-04-2024]
సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
[ 18-04-2024]
మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. -
పవన్ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు
[ 18-04-2024]
పవన్ కల్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని..
తాజా వార్తలు (Latest News)
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!