logo

దేశభక్తి రెపరెపలు

లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం రాజమహేంద్రవరంలో 75 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు.

Published : 10 Aug 2022 06:13 IST

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం రాజమహేంద్రవరంలో 75 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. కోటిపల్లిబస్టాండ్‌ నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా కోటగుమ్మం జంక్షన్‌ వరకు సాగిన ఈ ప్రదర్శనలో జాతీయ నాయకుల వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు.  లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు టి.అరుణ్‌, పి.సతీష్‌, అరుణకుమారి, కె.బేబీరాణి తదితరులు మాట్లాడారు.  లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక, ప్రజాసంఘాల నాయకులు  పవన్‌,  రాజు, ప్రకాష్‌, సావిత్రి, ఐ.సుబ్రహ్మణ్యం, భాగ్యలక్ష్మి, కోరుకొండ చిరంజీవి, బి.రాజులోవ, రవిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని