గోదారమ్మ కన్నెర్ర
గత నెలలో మహోగ్రరూపం చూపిన గోదావరి మళ్లీ కన్నెర్రజేసింది. నెల తిరగకముందే రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరడంతో లోతట్టు ప్రాంతాల్లో..
బోడసకుర్రు వైనతేయ వారధి వద్ద వరద నీటిలో పల్లిపాలెం
గత నెలలో మహోగ్రరూపం చూపిన గోదావరి మళ్లీ కన్నెర్రజేసింది. నెల తిరగకముందే రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరడంతో లోతట్టు ప్రాంతాల్లో.. లంక గ్రామాల్లో ఆందోళన మొదలైంది. రోజులుగా ముంపుతో అవస్థలు పడిన జనం.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడి కోలుకుంటున్న తరుణంలో ఎగువన వర్షాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాజా పరిస్థితిపై విపత్తుల నిర్వహణ సంస్థ యంత్రాంగాన్ని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసింది.
- ఈనాడు, అమలాపురం - న్యూస్టుడే, పి.గన్నవరం, ముమ్మిడివరం, టి.నగర్, సీతానగరం
బోడసకుర్రు పల్లిపాలెంలో మత్స్యకారుల నివాస గృహాలు ఇలా...
* పెరిగిన వరద..: రాజమహేంద్రవరం వద్ద వరద ప్రవాహం పెరిగింది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయల్లో ప్రవాహం ప్రమాదకరంగా మారింది. దీంతో కీలక శాఖలు ముందస్తు సన్నద్ధంలో నిమగ్నం అయ్యాయి. గురువారం ఓ వైపు కేంద్ర బృందంతోపాటు సాగుతుంటే.. ఆ కార్యక్రమంలో పాల్గొంటూనే తాజా పరిస్థితిపై క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తంచేశారు.
కొవ్వూరు పట్టణం, నిడదవోలు: ఎగువ నుంచి వరద నీరు భారీ స్థాయిలో చేరుతోంది. గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరవళ్లుతొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట విజ్జేశ్వరం వైపు వద్ద వరద ఉరకలెత్తుతోంది. రెండో ప్రమాద హెచ్చరికతో మద్దూరు లంకను వరద నీరు చుట్టుముట్టింది. కొవ్వూరు గోష్పద క్షేత్ర ప్రాంగణం, రెండు ప్రవేశ మార్గాల్లో నీరు చేరింది. ఆలయాలు ముంపుబారిన పడ్డాయి. గురువారం ఉదయం క్షేత్రానికి వరద తాకిడి పెరగడంతో భక్తులు వెనుదిరిగారు.
క్షేత్రంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్ కమ్ రైలు, గామన్ వంతెన, బాణాకార వంతెనల వద్ద వరద ఉద్థృతంగా ప్రవహిస్తోంది. వాడపల్లి, ఔరంగాబాదు ఇసుక ర్యాంపులు వరద ముంపునకు గురవ్వడంతో పడవలను ఒడ్డుకు తీసుకొచ్చి లంగరేశారు. మద్దూరులంక, చిగురులంక తదితర ప్రాంతాల్లో అరటి, కంద, కూరగాయల తోటల్లోకి నీరు చేరింది.
ఖండవల్లిలో గోదావరి నీటిలో నుంచి అరటి గెల తెచ్చుకుంటున్న రైతు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!