ఉద్యోగాలు ఇప్పిస్తానని టోకరా
స్మార్ట్ విలేజ్.. స్మార్ట్ యోజన పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేయడంతో బాధితులు దేవరపల్లి పోలీసుస్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కేంద్రప్రభుత్వం ద్వారా
500 మంది నష్టపోయినట్లు అంచనా
గోపాలపురం, న్యూస్టుడే: స్మార్ట్ విలేజ్.. స్మార్ట్ యోజన పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేయడంతో బాధితులు దేవరపల్లి పోలీసుస్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కేంద్రప్రభుత్వం ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి వరి వద్ద రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షలు వసూలు చేసి కొందరు ఊడాయించారు. దేవరపల్లి మండలం యదవోలుకు చెందిన దొనేపల్లి శివకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన ఇండిపూడి సుధాకర్ స్మార్ట్ విలేజ్.. స్మార్ట్ యోజనలో ఉద్యోగంలో నెలకు రూ.19,500జీతం వస్తుందని నమ్మించడంతో శివకృష్ణ రూ.3,35,000 చెల్లించి ఉద్యోగంలో చేరారు. మొదటి మూడు నెలలు సక్రమంగా జీతం అందడంతో శివకృష్ణ ద్వారా మరో ఆరుగురు రూ.మూడు లక్షలు కట్టారు. వారికి ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఉద్యోగ నియామకపత్రాలు ఇచ్చారు. తీరా కార్యకలాపాలు జరక్కపోవడం, కార్యాలయం అద్దె కూడా చెల్లించకపోవడంతో శివకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు జిల్లాలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ హరిబాబు, నాగరాజు, శివ, ఉదయభాస్కర్ ద్వారా మరికొంత మందితో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో సచివాలయాల పరిధిలో ఒక్కో కార్యాలయం ఏర్పాటు చేసి, దాని ద్వారా సుమారు 500 మంది నష్టపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవరపల్లి ఎస్సై శ్రీహరిరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య