logo

త్యాగధనుల కృషి ఫలితమే అమృతోత్సవం

ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సాధించుకుని ఫలాలు అనుభవిస్తున్నామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా

Published : 13 Aug 2022 03:41 IST

కాకినాడలో మాట్లాడుతున్న యనమల, చిత్రంలో చినరాజప్ప, నెహ్రూ, కొండబాబు తదితరులు

కాకినాడ నగరం, జగ్గంపేట, న్యూస్‌టుడే: ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సాధించుకుని ఫలాలు అనుభవిస్తున్నామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ శుక్రవారం జగ్గంపేటలో తలపెట్టిన ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ బుల్లెట్‌ ర్యాలీ కాకినాడ అచ్చంపేట జంక్షన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా యనమల, చినరాజప్ప మాట్లాడుతూ ప్రతిఒక్కరూ జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. పెద్దలు సాధించి పెట్టిన స్వాతంత్య్రాన్ని, దేశ సమగ్రతను కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా ముందుకు కదలాలన్నారు. అదే ఉద్దేశంతో తెదేపా ఆజాదికా అమృత్‌ మహోత్సవాల్లో పాలుపంచుకుంటోందని పేర్కొన్నారు. బుల్లెట్‌ ర్యాలీ అచ్చంపేట జంక్షన్‌ నుంచి సర్పవరం, భానుగుడి, జగన్నాథపురం మీదుగా జిల్లా తెదేపా కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పేరాబత్తుల రాజశేఖర్‌, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్‌, కాకినాడ నగర తెదేపా అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని