లోతట్టున కలవరం
లంక గ్రామాలను.. లోతట్టు ప్రాంతాలను జల గండం వీడలేదు. గోదావరి నీటిమట్టం 15 అడుగులు దాటిన తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి నిలకడగా ఉంది. ఎగువన వర్షాలు, వరదలు తగ్గడంతో పరిస్థితి కుదుటపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
పల్లంకుర్రులో పడవల్లోనే మత్స్యకారుల జీవనం
ఈనాడు, అమలాపురం, న్యూస్టుడే బృందం: లంక గ్రామాలను.. లోతట్టు ప్రాంతాలను జల గండం వీడలేదు. గోదావరి నీటిమట్టం 15 అడుగులు దాటిన తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి నిలకడగా ఉంది. ఎగువన వర్షాలు, వరదలు తగ్గడంతో పరిస్థితి కుదుటపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే లంక భూములు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం..కోనసీమ ప్రాంతంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఏటిగట్లు గుర్తించిన జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో ఆయా ప్రాంతాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెండు జిల్లాల కలెక్టర్లు హిమాన్షు శుక్లా, మాధవీలత తాజా పరిస్థితిపై కీలక శాఖల జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు.
* చుట్టూ నీరు..: గోదావరి వరదల ప్రభావం మరోసారి తాకడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. పి.గన్నవరం మండలం జి.పెదపూడి, మానేపల్లి పల్లెపాలెం, బూరుగులంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట లంక.. సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం.. అయినవిల్లిమండలం ఎదురుబిడుం.. మామిడికుదురు మండలం అప్పనపల్లి.. ఐ.పోలవరం మండలం పాగాకులంక, పల్లెగూడెం, జాంబవానిపేట, రామాలయం పేట, గోగుల్లంక, భైరవలంక.. ముమ్మిడివరం మండలం గురజాపు లంక, లంక ఆఫ్ ఠాణేలంక, కూనాలంక తదితర ప్రాంతాల రహదారులు, కాజ్వేలు జలమయం కావడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురయ్యింది. ఐ.పోలవరం మండలం వెదుర్లంక.. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లెపాలెంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి.. 600 మందికి భోజన- వసతులు ఏర్పాటుచేసినట్లు అధికారులు చెప్పారు.
నాగుల్లంక ఏటిగట్టు దిగువన ఇంటి చుట్టూ నీరు
* స్తంభించిన రాకపోకలు: లంక గ్రామాలవాసులు నిత్యం నీటి మధ్య గడుపుతూ బెంబేలెత్తిపోతున్నారు. లంక గ్రామాల్లోని ప్రధాన రహదారుల మధ్య ఉన్న కాజ్వేలు పూర్తిగా మునిగిపోవడంతో అక్కడ రాకపోకలు స్తంభించాయి. జాయింట్ కలెక్టర్ ధ్యాన్చంద్ర, ఆర్డీవో ఎం.ముక్కంటి, తహసీల్దారు నాగలక్ష్మమ్మ పాశర్లపూడి కాజ్వే నుంచి పడవ ద్వారా వరద ప్రాంతాల పరిస్థితిని పరిశీలించారు.కొత్తపేట ఆర్డీవో ఎం.ముక్కంటి వివిధ లంకగ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.