నాడు-నేడు సాగేదెలా..?
నాడు - నేడు రెండో విడత పనులు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. ప్రాథమిక తరగతుల్ని విలీనం చేసుకునే ఉన్నత పాఠశాలల్లోనే అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టాలని భావించారు.
శ్రీరామ్నగర్ ఉన్నత పాఠశాలలో నిలిచిపోయిన
అదనపు తరగతి గదుల నిర్మాణం
* కాకినాడ తిలక్వీధిలోని ఉన్నత పాఠశాలలో 20 అదనపు తరగతి గదులు నిర్మించాలని ఎంపిక చేశారు. స్థానిక పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో పనులకు ఆస్కారం లేకుండా ఉంది.
* శ్రీరామ్నగర్ ఉన్నత పాఠశాలలో రెండో విడత నాడు-నేడులో 17 గదులు నిర్మించాలని నిర్ణయించారు. స్మార్ట్సిటీ నిధులతో చేపట్టిన నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణం ఏడాదిన్నర అయినా నిధుల లేమితో పూర్తికాలేదు. ఇక్కడ నాలుగు గదులు అందుబాటులోకి వస్తే సరిపోతుంది. అయినా 17 నిర్మించాలని ఎంపిక చేశారు. ప్రస్తుతం అక్కడ అవసరం లేకపోవడంతో నిర్మాణ పనులను విరమించుకున్నారు.
కాకినాడ(వెంకట్నగర్), న్యూస్టుడే: నాడు - నేడు రెండో విడత పనులు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. ప్రాథమిక తరగతుల్ని విలీనం చేసుకునే ఉన్నత పాఠశాలల్లోనే అదనపు తరగతి గదుల నిర్మాణాలు చేపట్టాలని భావించారు. మళ్లీ మార్పులు చేసి అన్నింటికీ అవకాశం కల్పించారు. రెండు నెలలు సెలవులు వచ్చినా పనులు పూర్తిచేయలేదు. పాఠశాలల్ని పునఃప్రారంభించిన తర్వాత పనులు చేపట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం, వివిధ మరమ్మతులకు సంబంధించిన ఇసుక, సిమెంటు, కంకర, ఐరన్ తదితర సామగ్రిని ప్రాంగణాల్లో గుట్టలుగా వేయడంతో తరగతుల నిర్వహణ కష్టమవుతోందని వాపోతున్నారు.
స్థలం లేకుండా ఎలా నిర్మించాలి...
నాడు-నేడు రెండోవిడతలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చోటు కల్పించారు. నాడు-నేడు పనులపై కసరత్తు చేస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాల సాధ్యాసాధ్యాలు, అవసరమైన స్థలం ఉందా లేదా? నిర్మాణపరంగా ఎటువంటి అవకాశాలు ఉన్నాయనే అంశాలు తెలుసుకోకుండానే ఈ ప్రక్రియ చేపట్టారని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాకినాడ జిల్లాలో రెండోవిడత నాడు-నేడు పనులు చేపట్టేందుకు 942 పాఠశాలలను గుర్తించారు. వివిధ పనుల నిమిత్తం 710 పాఠశాలల యాజమాన్య ఖాతాల్లో నిధులు జమ చేశారు. జిల్లాకు సంబంధించి రెండోవిడత నాడు-నేడు పనులకు రూ.391 కోట్ల మేర ప్రతిపాదనలు పంపించగా ఇప్పటికి దాదాపు రూ.42 కోట్లు విడుదలయ్యాయి. అదనపు తరగతి గదుల నిర్మాణానికి మొదట 178 పాఠశాలలను ఎంపిక చేయగా తాజాగా 388 చోట్ల 2,078 అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా పాఠశాలల్లో స్థలం లేకపోవడం, అవసరం లేకపోవడం, ఇతర కారణాలు తెలుపుతూ 83 పాఠశాలల యాజమాన్యాలు అదనపు తరగతి గదుల నిర్మాణాలు వద్దన్నాయి. ఒక్క కాకినాడ నగరంలోనే అటువంటివి 15 పాఠశాలలకు పైగా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైన పాఠశాలల్లో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.
బోధనకు ఆటంకాలు
జిల్లా పరిషత్తు పాఠశాలల తరహాలో మిగిలిన పాఠశాలల్లో స్థలాలు విశాలంగా ఉండవు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే ప్రార్థన నిర్వహణ, ఆటలాడుకోవడం, భోజనం చేయడం వంటివి చేస్తుంటారు. ప్రస్తుతం నాడు-నేడు పనుల వల్ల ఆయా స్థలాల్లో ఇసుక, కంకర, ఐరన్ వేయడంతో వాటి నిర్వహణ కష్టమవుతోంది. దీనికితోడు నిర్మాణ పనుల కారణంగా యంత్రాల రణగొణ ధ్వనుల మధ్య పాఠాలు ఎలా చెప్పాలని కొంతమంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
ఆపనులు వేగవంతం చేస్తున్నాం..
కాకినాడ నగరం: జిల్లాలో నాడు-నేడు పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నాం. ఇప్పటికే కొన్ని అదనపు తరగతులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరికొన్ని రానున్నాయి.- డి.సుభద్ర, ఏపీసీ, సమగ్ర శిక్ష
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ.114 కోట్లు.. అప్పులు రూ.64 కోట్లు
[ 23-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. -
నామినేషన్ వేసిన పవన్.. అఖండ విజయం ఎన్డీయేదేనని ధీమా
[ 23-04-2024]
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. -
సీఎం వచ్చారని తెచ్చారు.. వెళ్లారని వదిలేశారు
[ 23-04-2024]
ఈ నెల 18న ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో బస్సు యాత్రం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైకాపా నేతలు, అధికారులు నానా హడావుడి చేశారు. -
అభివృద్ధి మాది.. విధ్వంసం జగన్ది..
[ 23-04-2024]
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో సోమవారం సాయంత్రం ప్రజాగళం బహిరంగ సభలో తెదేపా అధినేత ప్రసంగించారు. -
సత్యదేవుడి సేవల్లోనూ వైకాపా వేలు
[ 23-04-2024]
సంప్రదాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణలో ఇష్టానుసారం వ్యవహరించారు. వివాదాస్పదమై... -
పదిలో వెనుకబడిపోయాం..
[ 23-04-2024]
వసతుల లేమి, బోధనా సిబ్బంది కొరత, ఇతర అసౌకర్యాల నడుమ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా వెనుకబడి పోయింది. -
చంద్రబాబును కలిసిన నల్లమిల్లి
[ 23-04-2024]
ప్రజాగళం బహిరంగ సభకు జగ్గంపేట వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
నామినేషన్ల సందడి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలి
[ 23-04-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్ఎస్ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. -
ఫలితాలను ఏం మాయ చేశావ్
[ 23-04-2024]
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతున్నామన్న వైకాపా సర్కారు మాటలు బూటకమని తేలిపోయింది. సోమవారం వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అరకొర ఫలితాలే సాధించాయి. -
నిరుద్యోగ సమస్య తీర్చేవారికే మద్దతు
[ 23-04-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. -
కొంత మోదం.. కొంత ఖేదం
[ 23-04-2024]
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి 18,786 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 17,262 మంది ఉత్తీర్ణులయ్యారు. -
జిల్లాలో 24 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సోమవారం మొత్తం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి నాలుగు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్కు సానుకూల పవనాలు: రఘువీరారెడ్డి
[ 23-04-2024]
రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM