మండలానికో మహిళామార్ట్
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేయూత మహిళా మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలతో వీటిని నెలకొల్పనున్నారు.
మండల సమాఖ్య సమావేశంలో డ్వాక్రా మహిళలు (పాతచిత్రం)
న్యూస్టుడే, వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేయూత మహిళా మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలతో వీటిని నెలకొల్పనున్నారు. బ్యాంకు లింకేజీ, పొదుపు సొమ్ము, స్త్రీనిధి రుణాలతో చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న సంఘాలను పెద్ద వ్యాపార రంగంలోకి తీసుకురానున్నారు. ఫైలెట్ ప్రాజెక్టుగా తొలుత రెండు మండలాలను ఎంపిక చేశారు. తర్వాత దశల వారీగా మిగతా మండలాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు డీఆర్డీఏ జిల్లా పీడీ డేగలయ్య తెలిపారు.
రూ.కోటి పెట్టుబడితో..
జిల్లాలో రాజమహేంద్రవరం అర్బన్ మినహా మిగతా 18 మండలాల్లో రూ.60 లక్షల నుంచి రూ.కోటి పెట్టుబడితో వీటిని ఏర్పాటు చేయనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా నిడదవోలు, కోరుకొండ మండలాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిడదవోలు మండల సమాఖ్య పరిధిలో 19,054, కోరుకొండ మండల సమాఖ్య పరిధిలో 18,080 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లోని సభ్యులు ఒక్కొక్కరూ వాటా ధనంగా రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. చేయూత మహిళా మార్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత ఆ ఖాతాకు మహిళల వాటా సొమ్మును జమ చేస్తారు. ఇప్పటికే మండల సమాఖ్య వద్ద ఉన్న సొంతనిధి నుంచి వచ్చే వడ్డీ మొత్తాన్ని వాటాగా పెట్టనున్నారు. స్త్రీనిధి ద్వారా ఏటా వచ్చే డివిడెండ్ను దీనికి జత చేస్తారు. ఇలా ఒక్కో మండలంలో రూ.60 లక్షల వరకు పెట్టుబడి నిధి సమకూరనుంది. దీనికి అదనంగా బ్యాంకుల నుంచి రుణం మంజూరు చేసి ఒక్కో మండలంలో రూ.కోటి పెట్టుబడితో మహిళా మార్టులను నెలకొల్పి నిర్వహించనున్నారు. మార్ట్ల నిర్వహణ ద్వారా వచ్చే నికర లాభంలో సంఘాల వాటా ఆధారంగా ఒక్కో సంఘానికి 36 శాతం వరకు డివిడెండ్ కల్పించనున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 33,420 డ్వాక్రా సంఘాల్లో 3.37 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ప్రతి మండల సమాఖ్యలో 1700 నుంచి 2 వేల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. సాధారణ పెట్టుబడి నిధి కింద ప్రభుత్వం మండల సమాఖ్యలకు గతంలో రూ.40 లక్షలు చొప్పున ఇచ్చింది. వీటిని డ్వాక్రా సంఘాల సభ్యులకు అంతర్గత అప్పులుగా ఇవ్వడం ద్వారా వచ్చిన వడ్డీతో కలిపి ప్రస్తుతం ఒక్కొక్క మండల సమాఖ్య వద్ద సుమారు రూ.60 లక్షల వరకు నిధి ఉంది.
ఆర్థిక స్వావలంబన
డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ఉద్దేశంతోనే గ్రామీణ మహిళా మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తొలుత ప్రయోగాత్మకంగా నిడదవోలు, కోరుకొండ మండలాల్లో మహిళా మార్టుల ఏర్పాటు చేయనున్నాం. డ్వాకా మహిళలు తయారు చేస్తున్న సొంత ఉత్పత్తులను ఇక్కడ విక్రయించుకునే వీలుంటుంది. తద్వారా వ్యాపారాభివృద్ధితోపాటు ఆర్థికంగానూ సంఘాలు బలపడే అవకాశం కలుగుతుంది. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరలకు ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా ఈ మార్టులు పనిచేస్తాయి. -డేగలయ్య, డీఆర్డీఏ పీడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో పలువురి చేరిక
[ 18-04-2024]
మండలంలోని ఏ.మల్లవరం గ్రామానికి చెందిన పలువురు.. నాయకుడు లెక్కల రాము ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. -
సీఎం వస్తున్నారు.. మరి జనమో!
[ 18-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదిలి.. ప్రజాసేవకు కదిలి..
[ 18-04-2024]
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం.. అంతటితో ఆగలేదు ఆమె. -
చెప్పారంటే.. చేయరంతే!
[ 18-04-2024]
ముఖ్యమంత్రే స్వయానా హామీ ఇచ్చారు.. ఇంకేం అభివృద్ధికి అడుగులు పడినట్టే అని తూర్పుగోదావరి జిల్లా వాసులు భావించారు. అధికారులూ నిజమేననుకుని అంతే వేగంగా రూ.కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు చేసి పంపారు. ఇప్పటికి ఒక్క పని జరిగితే ఒట్టు. సమావేశాలు, -
అడ్డగోలుగా తవ్వేయ్.. అడ్డదారిలో అమ్మేయ్..
[ 18-04-2024]
అధికార పార్టీ నాయకులకు మట్టి.. బంగారంతో సమానం. ఎక్కడో ఓ చోట అని కాకుండా దొరికిన చోటల్లా దోచుకుంటూ, రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. -
వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!
[ 18-04-2024]
ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. -
సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడే
[ 18-04-2024]
జిల్లాలోని ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. -
తుంచేసిన కల.. కూత వినబడేదెలా
[ 18-04-2024]
దిగువ చిత్రాన్ని చూశారా.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైను పనుల దుస్థితి ఇదండి. కోనసీమ ప్రజల చిరకాల కల కోటిపల్లి- నర్సాపురం రైలు మార్గం. -
హామీల గారడి.. కోనసీమకు బురిడీ
[ 18-04-2024]
ప్రతిపక్ష నేతగా కోనసీమలో పర్యటించిన సమయంలో హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో సరేసరి. అవన్నీ నీటి మూటలయ్యాయి. -
దళితులపై దాడులు చేసేవారికి జగన్ పదోన్నతులు
[ 18-04-2024]
దళితులపై దాడులు చేసేవారికే ముఖ్యమంత్రి జగన్ పదోన్నతులు ఇస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. -
పేపరుమిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి
[ 18-04-2024]
రాజమహేంద్రవరం పేపరుమిల్లు యాజమాన్యం మొండివైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ డిమాండ్ చేశారు. -
అన్నొచ్చాడని నరికేశారు.. చిగురించిన తీరు.. సిగ్గుపడేలా సర్కారు
[ 18-04-2024]
సాధారణంగా ముఖ్యమంత్రి, ఆ స్థాయి వ్యక్తి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నప్పుడు రహదారులను బాగు చేస్తారు. ఆయా మార్గాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం
[ 18-04-2024]
మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. -
పవన్ గెలుపు.. పిఠాపురం అభివృద్ధికి మలుపు
[ 18-04-2024]
పవన్ కల్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని..
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?