ఎన్టీఆర్ పేరు తొలగింపు దారుణం: గోరంట్ల
ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం దారుణమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
టి.నగర్: ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం దారుణమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛాన్సలర్గా ఉన్న గవర్నర్కు కూడా పేరు మార్పు తెలియలేదన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా రోడ్లకు అడ్డంగా వైఎస్సార్ విగ్రహాలు పెడితే మేము అడ్డగించలేదన్నారు. దేశం, రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో త్యాగధనులున్నా వారి పేర్లు ప్రభుత్వానికి గుర్తుకురావడం లేదన్నారు. శాసన సభలో మాట్లాడనివ్వడం లేదన్నారు. మా ఎమ్మెల్యేలను తిడుతుంటే స్పీకర్గారు ఆనందంగా చూస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై చర్చించమంటే మమ్మల్ని బయటకు గెంటేస్తున్నారన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న జగన్, ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. రెండు లక్షల మందిని వాలంటీర్లుగా నియమించి, వారిని పార్టీ సేవలకు వినియోగిస్తూ అవే ఉద్యోగాలు ఇచ్చానని గొప్పలు చెబుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఏడు డీఎస్సీలు నిర్వహించి, 70 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 50 వేల ఉపాధ్యాయ పోస్టులు, పోలీసు శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 2016లో నిరుద్యోగ శాతం 17.9 శాతం ఉంటే... 2019లో 3.3 శాతం తగ్గిందన్నారు. అదే వైసీపీ పాలనలో నిరుద్యోగం 6.6 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఓడ రేవులతోపాటు ఆదాయం వచ్చే కంపెనీలను అదానీకి కట్టబెడుతున్నారన్నారు. 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 10.53 శాతం ఉండగా, వైసీపీ హయాంలో మైనస్ 3.26 శాతానికి చేరిందన్నారు. అభివృద్ధి పేరుతో అందరినీ మోసం చేస్తున్నారన్నారు. కుప్పంలో మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందని, చంద్రబాబు వేసిన రోడ్లపై వెళ్లి ప్రచారం చేస్తున్నారన్నారు. పులివెందుల్లో రాజధాని పెట్టే ఆలోచన ఉందని, అందుకే అక్కడ ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఉంటాయని చెప్పారన్నారు. పొత్తులు చివర్లో తేలతాయనీ, ఆ తర్వాత మార్పులు ఉంటాయని, అప్పటి వరకూ ఒంటరిగానే పోరాడుతున్నట్లు తెలిపారు. పార్టీలో ఒకప్పుడు యువతకు అవకాశం ఇద్దామనుకొన్నామని, గట్టి పోటీ నేపథ్యంలో సీనియర్లు ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజీనామా చేస్తే రూ.15వేలు ఆఫర్.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిళ్లు
[ 16-04-2024]
ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కొందరు వైకాపా నాయకులు, పాలకుల లక్ష్యం ఒక్కటే.. గ్రామ వాలంటీర్లతో రాజీనామా చేయించడమే. -
ఓటీఎస్ పేరిట వంచన.. మాయమాటలు చెప్పి రూ. కోట్లు గుంజుకున్న జగన్..!
[ 16-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంగా పేదలకు గృహాలకు సంబంధించి ఒక్క పైసా రుణమివ్వక పోగా వారికి మాయమాటలు చెప్పి, వినక పోతే బెదిరింపులకు పాల్పడి వారి వద్ద నుంచి ఓటీఎస్ పథకం పేరుతో రూ.కోట్లు దండుకున్నారు. -
అంతన్నావ్.. ఇంతన్నావ్.. రేషన్ సరకులు ఎగ్గొట్టావ్!
[ 16-04-2024]
రేషన్ సరకుల విషయంలో జగన్ సర్కార్ మాట తప్పింది.. మడం తిప్పింది. పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తొమ్మిది రకాల సరకులు రాయితీపై అందిస్తామని చెప్పి ఎగనామం పెట్టింది. -
భక్తులను బెధరగొట్టారు
[ 16-04-2024]
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అన్నవరం ఆలయం ఒకటి. సత్యదేవుని దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. పేద, మధ్య తరగతి భక్తులకు ఆర్థిక భారం లేకుండా దర్శనభాగ్యం కల్పించాల్సింది పోయి వైకాపా సర్కారు హయాంలో ధరల దోపిడీతో బెదరగొట్టారు. -
రండి బాబూ రండి.. ఇళ్ల స్థలాలు చూపిస్తాం
[ 16-04-2024]
-
నియామకాల బూటకం.. నకిలీల నాటకం
[ 16-04-2024]
రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందజేస్తున్నామని చెబుతున్న వైకాపా సర్కారుకు క్షేత్రస్థాయి పరిస్థితులు కనిపించడం లేదు. రాజమహేంద్రవరానికి నూతన వైద్య కళాశాలను తీసుకొచ్చి 150 ఎంబీబీఎస్ సీట్లతో పాటు బోలెడన్నీ ఉద్యోగ నియామకాలు చేపట్టా మంటున్నా. -
సీఎంపై దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నట్టు?
[ 16-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై దాడి సంఘటనను అధికార పార్టీ అవకాశంగా మలచుకోవాలని చూస్తోందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. -
ప్రలోభాలకు గురిచేస్తే.. తప్పదు భారీ మూల్యం
[ 16-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి అమలు కఠినతరం చేశారు. త్వరలో నామ పత్రాల స్వీకరణ పర్వం కూడా మొదలు కానుంది. -
సిద్ధమైతేనే చెత్తశుద్ధా!
[ 16-04-2024]
రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం నియోజకర్గాల పరిధిలోని గ్రామ పంచాయతీల నుంచి అధికారులు పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బందిని, చెత్త తరలింపు వాహనాలను కాతేరు గ్రామానికి తరలించారు. -
నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో జగన్ పర్యటన
[ 16-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉమ్మడి జిల్లాకు రానున్నారు. ఆ రోజు రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం మీదుగా రావులపాలెం మండలం ఈతకోట చేరుకుంటారు. -
ఆడపిల్లని తుప్పల్లో విసిరేసి..
[ 16-04-2024]
ప్రస్తుత సమాజంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు రాణిస్తున్నారు. ఏ రంగమైనా దూసుకుపోతున్నారు. అయినా ఎక్కడో ఏదో మూల వివక్ష ఎదురవుతుంది. -
యాగశాల క్రతువులో సిరివెన్నెల తనయుడు
[ 16-04-2024]
సీతానగరం మండలం శ్రీరామనగరం సద్గురు చిట్టిబాబాజీ సంస్థానంలో సోమవారం ఉదయం యాగశాల నిర్మాణానికి సినీగేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు సంగీత దర్శకుడు యోగీశ్వరశర్మ విచ్చేసి భూమిపూజలో పాల్గొన్నారు. -
కెమెరా కళ్లు గప్చుప్ కేటుగాళ్లు హల్చల్
[ 16-04-2024]
జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో నిఘా కెమెరాల వ్యవస్థ నిద్దరోతోంది. దీంతో ఎన్నికల వేళ భద్రత సవాల్గా మారింది. గొడవలు, కవ్వింపు చర్యలు, అక్రమ మద్యం, నగదు, బహుమతుల తరలింపు, దొంగతనాల నివారణ తదితర చర్యలకు సీసీ కెమెరాల వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుంది. -
వైకాపాకే ఓటేయాలని బెదిరింపు
[ 16-04-2024]
కాకినాడ సంజయ్నగర్లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద సోమవారం ఘర్షణ వాతావరణం ఏర్పడింది. -
దిగొచ్చిన దేవదాయ శాఖ
[ 16-04-2024]
పిఠాపురం పాదగయ క్షేత్రంలో పూజాధికాల రుసుముల పెంపుపై హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. భక్తులను దేవాలయానికి దూరం చేసే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం నిరసన తెలిపారు. -
పవన్ పిఠాపురంలో ఇల్లు నిర్మించుకుంటారు: నాగబాబు
[ 16-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పిఠాపురమే శాశ్వత నివాస స్థలం అవుతుందని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. -
బొట్టు బిళ్లలనూ వదల్లేదు!
[ 16-04-2024]
‘కాదేదీ ప్రచారానికి అనర్హం’ అని నిరూపిస్తున్నారు కొందరు వైకాపా నాయకులు.. అవకాశం ఉన్న అన్ని మార్గాలనూ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వినియోగించుకుంటున్నారు. -
అధికారులు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
[ 16-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో ఎస్ఈబీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఎస్ఈబీ ఎస్పీ ఎన్వీఎస్ మూర్తి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బిష్ణోయ్ అంతు చూస్తాం’.. సల్మాన్ను కలిసిన సీఎం శిందే
-
ఇకపై ప్రతీ మ్యాచ్ మాకు సెమీఫైనల్ లాంటిది: ఆర్సీబీ హెడ్ కోచ్
-
సీఎం జగన్పై రాయి దాడి కేసులో అక్రమంగా ఇరికిస్తున్నారని ఆందోళన
-
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్తో సాన్యా
-
సాంకేతిక తప్పిదం.. వేరే జంటకు విడాకులు!
-
ఆజాద్ వ్యాఖ్యలకు దీటుగా కాంగ్రెస్ నాలుగు ప్రశ్నలు