అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సహకరించాలి
జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులు పెద్దఎత్తున ఇవ్వాలని కలెక్టర్ కృతికాశుక్లా కోరారు. శనివారం కలెక్టరేట్లో జేసీ ఇలక్కియతో కలిసి వివిధ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సీఎస్ఆర్ నిధులపై
సమీక్షిస్తున్న కలెక్టర్ కృతికాశుక్లా, పక్కన జేసీ ఇలక్కియ
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులు పెద్దఎత్తున ఇవ్వాలని కలెక్టర్ కృతికాశుక్లా కోరారు. శనివారం కలెక్టరేట్లో జేసీ ఇలక్కియతో కలిసి వివిధ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సీఎస్ఆర్ నిధులపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో చమురు, ఎరువుల తయారీ, పోర్టులు తదితర సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, వీటికి సంబంధించి సీఎస్ఆర్ నిధులు క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. గిరిజన, సబ్ప్లాన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. విద్య, వైద్యానికి ఈ నిధులు వెచ్చించామని, జిల్లాలో అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడాకారులున్నారని, వీరికి ప్రోత్సాహం అందించాలన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలకు ఈ నిధులివ్వాలన్నారు. సమావేశంలో సీపీవో త్రినాథ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
* పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం జేసీ ఇలక్కియ, రెవెన్యూ, పురపాలక అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు జగనన్న కాలనీల్లో ఖాళీ ప్లాట్లను కేటాయించాలన్నారు. ఇంకా అవసరమైన లే-ఔట్లకు భూసేకరణ చేపట్టాలని సూచించారు.
* జిల్లాలో డిగ్రీ చదువుతున్న 11,622 మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ కార్యక్రమం కింద నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రైవేటు సంస్థలతో విద్యార్థుల మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలో 54 కళాశాలల ప్రతినిధులు హాజరై మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM