logo

వైకాపా ప్లీనరీలో బాగా పనిచేసిన పోలీసులకు ప్రశంస

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ఈ ఏడాది జులై 8, 9 తేదీల్లో వైకాపా ప్లీనరీ నిర్వహించిన విషయం తెలిసిందే.. ఆ రెండు రోజులూ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజలు పాల్గొన్న

Published : 25 Sep 2022 03:11 IST

ఏఆర్‌ ఏఎస్పీ సత్యనారాయణకు ప్రశంసాపత్రం అందజేస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

కాకినాడ(మసీదుసెంటర్‌), న్యూస్‌టుడే: గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ఈ ఏడాది జులై 8, 9 తేదీల్లో వైకాపా ప్లీనరీ నిర్వహించిన విషయం తెలిసిందే.. ఆ రెండు రోజులూ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజలు పాల్గొన్న కార్యక్రమాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమర్థంగా విధులు నిర్వర్తించిన కాకినాడ జిల్లాకు చెందిన పోలీసు అధికారులకు శనివారం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏఆర్‌ ఏఎస్పీ సత్యనారాయణ, ట్రాఫిక్‌ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ వెంకటఅప్పారావు సేవలను గుర్తించి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి జారీ చేసిన ప్రశంసాపత్రాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా వారికి అందజేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని