కట్టేసుకోండి.. కళ్లప్పగిస్తాం
అమలాపురం మండలం కామనగరువులోని ఓ అపార్టుమెంట్ నిర్మాణానికి అయిదు అంతస్తుల వరకు అనుమతులు తీసుకుని.. ఆరో అంతస్తు కట్టారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. వారు నోటీసు ఇచ్చినా.. భవన
కామనగరువులో అదనపు అంతస్తుకు అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనం
* అమలాపురం మండలం కామనగరువులోని ఓ అపార్టుమెంట్ నిర్మాణానికి అయిదు అంతస్తుల వరకు అనుమతులు తీసుకుని.. ఆరో అంతస్తు కట్టారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. వారు నోటీసు ఇచ్చినా.. భవన యజమాని మాత్రం నిర్మాణం ఆపలేదు. ఇదే తరహా బహుళ అంతస్తుల భవనాలు ఈదరపల్లిలోనూ నిర్మిస్తున్నా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
* నలువైపులా ఖాళీ స్థలం(సెట్ బ్యాక్స్) వదలకుండా కట్టడం, ఇంటికి ప్లాన్ తీసుకుని వాణిజ్య సముదాయం నిర్మించడం, పంచాయతీలకు దాఖలుచేసిన స్థలాలను వదలకుండా నిర్మాణాలు చేపట్టడం.. ఇలాంటి అతిక్రమణలు కోకొల్లలుగా జరిగిపోతున్నాయి. కొత్తగా ఏర్పడిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రధాన రహదారులు, పట్టణాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఇటీవల ఈ తంతు కళ్లముందే జరుగుతున్నా.. అధికారులకు పట్టడం లేదనే విమర్శలున్నాయి.
న్యూస్టుడే, అమలాపురం గ్రామీణం, ముమ్మిడివరం
ఒకప్పుడు నగరాలు, పట్టణాల్లో కనిపించే అపార్టుమెంట్ల సంస్కృతి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోంది. ప్రధానంగా జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారుల వెంట పట్టణాల సమీప గ్రామాల్లోనూ బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. జిల్లాలోని ఐ.పోలవరం మండలం ఎదుర్లంక నుంచి ప్రారంభమైన 216 జాతీయ రహదారి రాజోలు మీదుగా పశ్చిమగోదావరి జిల్లా వరకు విస్తరించి ఉంది. మరోవైపు అమలాపురం నుంచి రావులపాలెం వరకు ప్రధాన రహదారి ఉంది. యానాం నుంచి మండపేట ప్రధాన రహదారి చెంతన పట్టణానికి ఆనుకుని ఉన్న పంచాయతీ పరిధుల్లో ఈ భవన నిర్మాణాలు చేపడుతున్నారు. రుసుముల తగ్గింపు, నిబంధనలను తోసిరాజని నిర్మాణాలు చేపట్టినా ఎవరూ పట్టించుకోరని.. బహుళ అంతస్తులు కట్టేస్తున్నారు. అనుమతులు ఒకలా తీసుకుంటే.. నిర్మాణాలు మరొకలా చేపడుతున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన పంచాయతీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
గ్రామీణ ప్రాంతాల్లో..
జిల్లాలోని అమలాపురం గ్రామీణం కామనగరువు, ఈదరపల్లి, బండారులంక, జనుపల్లె, పేరూరులో ఈ తరహా భవన నిర్మాణాలు ఏడాదిగా జరుగుతున్నాయి. అంబాజీపేట, కొత్తపేట, రావులపాలెం, రాజోలుతోపాటు రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం నగర పంచాయతీకి సమీప గ్రామాల్లోనూ అపార్టుమెంట్లు వెలుస్తున్నాయి.
నిబంధనలేం చెబుతున్నాయంటే..
బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలంటే తప్పనిసరిగా 30 అడుగుల రహదారి సౌకర్యం ఉండాలి. కొందరు క్షేత్రస్థాయిలో 20 నుంచి 25 అడుగుల వరకే పరిమితం చేస్తున్న పరిస్థితులున్నాయి. భవనం విస్తీర్ణాన్ని బట్టి చుట్టూ 1.5 నుంచి 3 మీటర్ల వరకు తప్పనిసరిగా ఖాళీ స్థలం (సెట్ బ్యాక్స్) వదలాలి. ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. పంచాయతీల్లో గ్రౌండ్ ఫ్లోర్తోపాటు మరో రెండు అంతస్తులకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఆపై అంతస్తులు నిర్మించాలంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) నుంచి అనుమతి తెచ్చుకోవాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఎక్కువ నిర్మాణాల్లో ఆరో అంతస్తు నిర్మిస్తున్నా.. సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం..
గ్రామాల్లో నిర్మించే బహుళ అంతస్తుల భవనాలకు జీప్లస్ 2 వరకు పంచాయతీ స్థాయిలో అనుమతులు ఇస్తారు. ఆపై నిర్మించే వాటికి డీటీసీపీ నుంచి అనుమతులు తీసుకోవాల్సిఉంది. అలా అనుమతులు లేనివి మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- వి.కృష్ణకుమారి, జిల్లా పంచాయతీ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలన అంతమొందిద్దాం
[ 24-04-2024]
జగన్ పరిపాలనను అంతమొందిద్దాం.. పిడికిలి బిగించి మరీ కూటమిని గెలిపించుకుందామని జనసేన అధినేత పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ప్రసంగించారు. -
జగన్ మాటిస్తే.. నీటి మూటే!
[ 24-04-2024]
సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్ నొక్కారు. -
తలూపినా తలోదారే!
[ 24-04-2024]
రాజమహేంద్రవరం నగరంలో అధికార పార్టీ నేతల్లో వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా వీరిమధ్య పొరపొచ్చాలు సమసిపోవడం లేదు. -
రోగుల భద్రత మరిచావా పాలకా!
[ 24-04-2024]
ఒకప్పుడు నిత్యం ప్రయాణికులతో కళకళలాడే గోదావరి రైల్వేస్టేషన్ పలు సమస్యలతో కునారిల్లుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు, కూరగాయలు తీసుకొచ్చే చిరు వ్యాపారులు.. చదువుల నిమిత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు.. ఉద్యోగులు ఇక్కడి నుంచే పాసింజర్లలో రాకపోకలు సాగించేవారు. -
అనపర్తి.. వీడిన అనిశ్చితి
[ 24-04-2024]
అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. -
మామ బడాయి మాటలు..
[ 24-04-2024]
నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు -
బటన్ నొక్కి జగన్ ఎంత డబ్బు వెనకేశారు?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయిదేళ్ల పాటు బటన్ నొక్కి పేదలకు డబ్బులు పంపిణీ చేశానని చెబుతున్నారని, అదే బటన్ నొక్కి ఆయన ఇంకెంత వెనకేసుకున్నారని వంగవీటి రాధా ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు -
రూ.2.58 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం
[ 24-04-2024]
ఎన్నికల తనిఖీల్లో భాగంగా కడియం పోలీసులు రూ.2.58 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
హోంమంత్రి ర్యాలీలో గాయపడిన దళితుడు ఇకలేరు
[ 24-04-2024]
హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ ర్యాలీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ పడిపోయి గాయపడిన దళితుడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన పల్లపు అబ్బులు (73) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
మే 26 వరకు కాకినాడ- విశాఖ రైలు రద్దు
[ 24-04-2024]
కాకినాడ పోర్టు- విశాఖపట్నం(17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు(17267) రైళ్లను ఈ నెల 29 నుంచి మే 26 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
వైకాపా గొప్పలు.. రైతుకు తిప్పలు
[ 24-04-2024]
మాది రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా పాలనలో కర్షకులు అనుభవిస్తున్న అవస్థలకు ఈ చిత్రమే నిదర్శనం. కట్టిస్తామన్న గోదాములు నిర్మించక, కనీసం కళ్లాలకూ స్థలాలు చూపకపోవడంతో రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. -
జగన్ను కుర్చీ దింపాలి
[ 24-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్