Kakinada: కాకినాడ కలెక్టర్ పేరు చెప్పి.. రూ.లక్షల్లో కొట్టేసేందుకు యత్నించారు!
నేను మీటింగ్లో ఉన్నాను.. మాట్లాడే పరిస్థితిలో లేను.. అర్జంట్గా నాకు డబ్బు కావాలి.. అమెజాన్ పేలో డబ్బులు పంపించండి’’.. కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా చిత్రం డీపీగా ఉన్న వాట్సాప్ నంబరుతో మంగళవారం ఉదయం పలువురు జిల్లాస్థాయి అధికారులకు వచ్చిన వాట్సాప్ సందేశమిది.
ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి ఫోన్ నంబర్కు డీపీగా కాకినాడ జిల్లా కలెక్టర్ ఫొటో
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, వెంకట్నగర్: ‘‘నేను మీటింగ్లో ఉన్నాను.. మాట్లాడే పరిస్థితిలో లేను.. అర్జంట్గా నాకు డబ్బు కావాలి.. అమెజాన్ పేలో డబ్బులు పంపించండి’’.. కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా చిత్రం డీపీగా ఉన్న వాట్సాప్ నంబరుతో మంగళవారం ఉదయం పలువురు జిల్లాస్థాయి అధికారులకు వచ్చిన వాట్సాప్ సందేశమిది.. కాకినాడ జిల్లా సీపీవో, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, డ్వామా పీడీ ఇలా పలువురు అధికారులకు సమాచారం రావడంతో.. కలెక్టర్ డబ్బులు అడగడం ఏంటి..? మెసేజ్ పెట్టడం ఏంటి..? వాట్సాప్ డీపీగా కలెక్టర్ ఫొటో ఉన్నా.. నంబరు మాత్రం వేరేగా ఉంది..? ఈ సందేశాలు అధికారుల్లో చర్చనీయాంశం అయ్యాయి. రూ.1.50 లక్షలు అడిగినట్లు తెలుస్తోంది. ఓ అధికారి ధైర్యం చేసి కలెక్టర్నే నేరుగా విషయం అడిగేశారు. దీంతో అవాక్కయిన ఆమె నేను డబ్బులు అడగడం ఏంటని.. వ్యవహారంపై ఆరా తీశారు. వెంటనే జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్బాబుతో మాట్లాడి పరిస్థితి వివరించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా పరిస్థితిపై అప్రమత్తమైన కలెక్టర్... తన పేరుతో వాట్సాప్ కాల్, సందేశాలు ఎవరు పంపి డబ్బులు అడిగినా స్పందించవద్దని.. ఈ తరహా సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. దీంతో ఆయా శాఖల అధికారులు మిగిలిన యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఠా పనే...
కలెక్టర్ పేరుతో మోసపుచ్చింది ఉత్తరప్రదేశ్కు చెందిన హరి ఓం గుప్తాగా పోలీసులు గుర్తించారు. వాట్సాప్ నంబరు 70173 02622 ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు ప్రత్యేక బృందాన్ని పంపించారు. గతంలో సీసీఎల్ఏ, సర్వే కమిషనర్, ప్రకాశం కలెక్టర్ పేరుతో ఇలాంటి మోసాలు జరిగినట్లు సమాచారం. ఈ ముఠా గుట్టు పసిగట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టిసారించారు. ఇదిలా ఉండగా కాకినాడ త్రీ టౌన్ పరిధిలో సైబర్ నేరం కింద కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)