కాదంటే..ఔననిలే!
కళ్లెదుట రూ.కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు.. అనుమతులు ఇస్తే తవ్వుకుపోవాలని చాలా మంది కాసుక్కూర్చున్నారు. దశాబ్దానికి పైగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం మారింది.. నాయకుల రంగులూ మారాయి.. ఎట్టకేలకు రాయబేరాలు కొలిక్కివచ్చాయి. అధికారిక ఆశీస్సులు దక్కాయి. ఇంకేముంది.. అనుమతులకు పచ్చజెండా ఊపడంతో తవ్వకాలకు మార్గం సుగమమైంది.
ఈనాడు - కాకినాడ
ప్రత్తిపాడు: చింతలూరు ప్రాంతంలో గనుల తవ్వకాలకు అనువుగా ఏర్పాట్లు
కళ్లెదుట రూ.కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు.. అనుమతులు ఇస్తే తవ్వుకుపోవాలని చాలా మంది కాసుక్కూర్చున్నారు. దశాబ్దానికి పైగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం మారింది.. నాయకుల రంగులూ మారాయి.. ఎట్టకేలకు రాయబేరాలు కొలిక్కివచ్చాయి. అధికారిక ఆశీస్సులు దక్కాయి. ఇంకేముంది.. అనుమతులకు పచ్చజెండా ఊపడంతో తవ్వకాలకు మార్గం సుగమమైంది.
కుదరదంతే...
అభయారణ్యానికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం పచ్చదనంతో నిండింది. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు సాగించాలంటే వృక్షాలు తొలగించాలి. ఇక్కడి తవ్వకాలతో వన్యప్రాణుల మనుగడకు విఘాతం కలుగుతుంది.. లేటరైట్ రవాణా చేసే భారీ వాహనాల రాకపోకలు.. కాలుష్యంతో స్థానికుల ఆరోగ్యానికీ ఇబ్బందే. సమీప గ్రామాల్లో తాగునీరు కలుషితం అవుతుందనే భయం ఉంది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని క్వారీ లీజులు మంజూరు చేయడం కుదరదు.
-ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామ సర్వే నంబర్-1లో గనుల తవ్వకం లీజు దరఖాస్తుపై అటవీశాఖ అభ్యంతరమిది..
(ఆర్సీ నంబర్: 3804/ 2017, తేదీ: 09.05.2018)
మైనింగ్ అనుమతులు మంజూరు చేయవద్దని చింతలూరు సచివాలయం ఎదుట ఆందోళన (పాతచిత్రం)
సరేలే.. తవ్వుకోండి..
ప్రత్తిపాడు మండలం చింతలూరులో లేటరైట్ తవ్వకాలకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఒక లీజు మంజూరు చేయగా.. మరో నాలుగు లీజులకు అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పర్యావరణ సంబంధిత అంశాలపై తాజాగా కాలుష్య నియంత్రణ మండలి గ్రామసభ నిర్వహించింది. ప్రజలు పెద్దగా రాకపోయినా.. ఒకే వేదికపై అన్ని అనుమతులపై చర్చించి అడ్డంకులు తొలగించే ప్రయత్నం చేశారు. గతంలో అనుమతులకు అభ్యంతరం చెప్పినప్పుడు.. ఇప్పుడెలా అనుమతులు సాధ్యమనే చర్చ నడుస్తోంది.
చింతలూరు కొండ
తగ్గేదేలే..
చింతలూరు సర్వే నెంబరు 1లో సత్యశాంతి సంక్షేమ సేవా సమితి 36.669 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలకు మార్చిలో లీజు పొందింది. తవ్వకాలకు అనువుగా రోడ్లు, ఇతర వనరులు సమకూర్చుకున్నారు. ఈ లీజు కేటాయింపును వ్యతిరేకిస్తూ వైకాపా మద్దతు సర్పంచి, ఎంపీటీసీ సభ్యుడు, ఇతర నాయకులు ఆందోళనలు చేశారు. గనుల లీజుల కోసం పంచాయతీ తీర్మానాలు తీసుకోలేదనీ... ప్రత్యేక అధికారాలతోనే వ్యవహారం చక్కబెట్టారని సర్పంచి గంగ, ఎంపీటీసీ సభ్యురాలు షర్మిల.. ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇంత జరిగినా.. అధికార పక్ష కీలక నేత జోక్యంతో సద్దుమణిగింది. ఈ క్వారీ వెనుక ఓ బడా నాయకుడు ఉండటమే ఇక్కడి పరిస్థితి కుదుటపడడానికి కారణమని తెలుస్తోంది. ఇటీవల కొత్త అనుమతుల జారీకి పీసీబీ ఆధ్వర్యంలో కాకినాడ జేసీ ఇలక్కియా ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. సర్వే నంబరు 1లోనే 54.48 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలకు హైదరాబాద్కు చెందిన మార్లిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో 40.93 హెక్టార్లలో మూడు లీజులకు, స్వర్ణభారతి ఎంటర్ప్రైజెస్ పేరుతో 13.55 హెక్టార్లలో ఒక లీజుకు 20 ఏళ్లపాటు తవ్వకాలకు అనుమతించాలని సంబంధిత యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. 2020 నుంచి ఈ లీజులకు ప్రయత్నిస్తుండగా.. అధికారపక్ష ఆశీస్సులతోనే తాజాగా అడ్డంకులు తొలగాయనే వాదన వినిపిస్తోంది.
ఇది మా అడ్డా...
చింతలూరు కొండలు తోటపల్లి అభయారణ్యం పరిధిలోకి వస్తాయి. సర్వేనంబరు 1లో సుమారు 950 హెక్టార్లలో 720 హెక్టార్లు రక్షిత అటవీ ప్రాంతంలో ఉంటే.. మిగిలింది రెవెన్యూ పరిధిలోకి వస్తుంది. తాజాగా లీజులు రెవెన్యూ భూమిలో కేటాయించారు. అయిదు లీజుల్లో 91.15 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలు సాగనున్నాయి.. తాజా ప్రజాభిప్రాయం సేకరణ జరిగిన నాలుగు లీజుల మంజూరు లాంఛనమేనని తెలుస్తోంది. క్వారీల్లో లీజులు ఎవరి పేరిట పొందినా తెరవెనుక పెద్దలే చక్రం తిప్పుతుండడంతో అనుమతులు, అభ్యంతరాలతో పనిలేదనే వాదన వినిపిస్తోంది.
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వంతాడ, గజ్జనపూడి, గిరిజనాపురం ప్రాంతాల్లో క్వారీ తవ్వకాల చుట్టూ వివాదాలు కొత్తేమీ కాదు. ఇక్కడి కొండల్లో సిమెంటు తయారీకి వాడే లేటరైట్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ తవ్వకాలు, అక్రమాలు, విచారణల వ్యవహారం రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీశాయి.
అటవీ అనుమతులు తప్పనిసరి
రక్షిత అటవీ ప్రాంతానికి ఆనుకుని గనుల తవ్వకాలు జరపాలంటే శాఖాపరంగా నిరభ్యంతర పత్రం తప్పనిసరి. చింతలూరులో తవ్వకాల కోసం నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరూ దరఖాస్తు చేయలేదు. అనుమతులు ఇవ్వలేదు. గతంలో అనుమతులు ఇచ్చారా లేదా..? అనే విషయం పరిశీలిస్తాం. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపడానికి వీల్లేదని అభ్యంతరం తెలిపిన విషయం నాదృష్టికి రాలేదు. దస్త్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.
- రాజు, డీఎఫ్వో, కాకినాడ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరంలో నూతన ధ్వజస్తంభ పనులకు శ్రీకారం
[ 28-03-2024]
అన్నవరం దేవస్థానంలో అనివేటి మండపంలో బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి గురువారం శ్రీకారం చుట్టారు. -
అనపర్తి బరిలో విశ్రాంత సైనికుడు
[ 28-03-2024]
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనపర్తి నియోజకవర్గం తెదేపా, భాజపా, జనసేన కూటమి అభ్యర్థిగా విశ్రాంత జవాన్ ములగపూడి శివకృష్ణంరాజు పేరును అధిష్ఠానం బుధవారం రాత్రి ప్రకటించింది. -
ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?
[ 28-03-2024]
రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష.. దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ -
ఎన్నికలొస్తున్నాయి ఆపేయండి.. రూ.కోట్లు పెట్టాం కుదరదు!
[ 28-03-2024]
ఎన్నికలకు ఇంకా 47 రోజులే సమయం ఉంది. అయిదేళ్లుగా చేపట్టిన ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాం.. ఇకనైనా తవ్వకాలు నిలిపి.. సహకరించండి.. -
కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
[ 28-03-2024]
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. -
2,400 ఇళ్ల రద్దు
[ 28-03-2024]
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన గృహాల్లో 2,403 రద్దు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు పునాదులు పడని ఇళ్లను జాబితా నుంచి తొలగించారు. -
సి-విజిల్ ఫిర్యాదులపై సత్వర చర్యలు
[ 28-03-2024]
సాధారణ ఎన్నికలకు సంబంధించి సీ-విజల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కృతికాశుక్లా తెలిపారు. -
‘జగన్ను ఇంటికి పంపడమే కూటమి లక్ష్యం’
[ 28-03-2024]
అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన జగన్ను ఇంటికి పంపడమే తెదేపా, జనసేన, భాజపా కూటమి లక్ష్యమని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. -
కొంటారా.. కొర్రీలు వేస్తారా..?
[ 28-03-2024]
గత రెండేళ్లుగా రబీలో బొండాలు (ఎంటీయూ 3626) రకం ధాన్యం కొనుగోలుపై అయోమయం నెలకొంటోంది. ఈ రకం సాగు చేయొద్దని.. చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని రెండేళ్ల కిందట వ్యవసాయ, పౌరసరఫరా శాఖల అధికారులు రైతులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. -
వాత్సల్యం చూపలేదు..!
[ 28-03-2024]
కె.గంగవరం మండలం కుడుపూరుకు చెందిన వీధి జీవన్బాబు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య మందపల్లి వెంకట్రావు వద్ద పెరుగుతున్నాడు. ప్రస్తుతం దంగేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. -
ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. -
జగనన్నకాలనీలో యువకుడిని బలిగొన్న విద్యుత్తు తీగలు
[ 28-03-2024]
జగనన్నకాలనీలో చేతికందే ఎత్తులో ఉన్న అధిక సామర్థ్యపు విద్యుత్తు తీగ తగిలి పెయింటింగ్ పనులు చేసే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. -
నల్లమిల్లికి టికెట్ కేటాయించలేదని నిరసన
[ 28-03-2024]
అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. -
వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో సంబంధం
[ 28-03-2024]
రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్ బ్యాచ్తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. -
‘వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారు’
[ 28-03-2024]
వైకాపా పాలనలో పంచాయతీలను పనికిరాకుండా చేశారని సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైకాపా సీనియర్ నాయకుడు అల్లు విజయ్ కుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా