అడుగడుగునా ఆదరణ
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు శుక్రవారం ద్వారకాతిరుమల మండలంలో సాదర స్వాగతం లభించింది. దెందులూరు మండలం పెరుగుగూడెంలో ఉదయం 9 గంటలకు యాత్ర మొదలైంది.
ద్వారకాతిరుమల ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్న పాదయాత్ర
ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్టుడే- ద్వారకాతిరుమల, కామవరపుకోట: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు శుక్రవారం ద్వారకాతిరుమల మండలంలో సాదర స్వాగతం లభించింది. దెందులూరు మండలం పెరుగుగూడెంలో ఉదయం 9 గంటలకు యాత్ర మొదలైంది. పూజా కార్యక్రమాల అనంతరం మెట్టపంగిడిగూడెం వైపు సాగింది. పంగిడిగూడెం చేరుకునే సరికి పరిసర ప్రాంతాల రైతులు, రైతు కూలీలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. కొందరు భవనాలపై నుంచి పూల వర్షం కురిపించారు. అమరావతే రాష్ట్రానికి రాజధాని అంటూ నినదించారు. రైతులు భారీగా ట్రాక్టర్లపై యాత్రలో పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల మహిళలు కోలాటం చేస్తూ నినాదాలు చేశారు. యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఆయా గ్రామాల ప్రజలు రహదారులకు ఇరువైపులా చేరి పూలతో స్వాగతం పలికారు. రథానికి ముందు నీరు పోసి, కొబ్బరికాయలు కొట్టారు. మహిళా రైతులకు కుంకుమ పెట్టి స్వాగతించారు. గుమ్మడి కాయలతో దిష్టితీసి, హారతులిచ్చారు. తెదేపా, సీపీఎం, సీపీఐ, భాజపా నాయకులు సంఘీభావం ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు తిమ్మాపురంలో భోజన విరామం తీసుకున్నారు. అనంతరం 3 గంటలకు బయలుదేరి ద్వారకాతిరుమల చేరుకున్నారు. ప్రవేశద్వారం వద్ద రైతులు స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఐకాస సభ్యులు ఆలయానికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని పూజలు చేశారు.
నేడు యాత్రకు విరామం: ద్వారకాతిరుమలలో శుక్రవారం సాయంత్రం మహాపాదయాత్ర ముగిసిన వెంటనే వైష్టవి ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. శనివారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఆదివారం 21వ రోజు పాదయాత్ర మొదలై నల్లజర్ల మండలం చేరనుంది.
రూ.లక్ష విరాళం అందిస్తున్న తెదేపా నాయకులు
రూ.లక్ష విరాళం..
గోపాలపురం: అమరావతి రైతుల చేస్తున్న మహా పాదయాత్రకు గోపాలపురం మండలం వేళ్లచింతలగూడెం, పెద్దాపురం గ్రామానికి చెందిన తెదేపా నాయకులు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. తిమ్మాపురంలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేశారు. కొర్లపాటి రాము, యిల్లూరి రాంబాబు, కొయ్య శివరామకృష్ణ, పరిమి జగదీష్, కొయ్య రమణ, కొర్లపాటి అన్నవరం, మద్దిపాటి సత్యనాగేంద్ర, గ్రామస్థులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత