పూర్తి వసతులతో 14 వైద్య విభాగాలు
ప్రభుత్వం వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో త్వరలో పూర్తిస్థాయి వసతులతో 14 రకాల వైద్య విభాగాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా సర్వజన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.రమేష్ పేర్కొన్నారు.
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం
ప్రభుత్వం వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో త్వరలో పూర్తిస్థాయి వసతులతో 14 రకాల వైద్య విభాగాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా సర్వజన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.రమేష్ పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రి సర్వజన ఆసుపత్రిగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో రోగులకు అందే సేవలు, వైద్య కళాశాల పనుల ప్రగతి, నిధులు, నియామకాలు తదితర అంశాలపై ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఎన్ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా..
జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన భవనాల నిర్మాణాలు, పాత భవనం ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పన, పరికరాలు, యంత్రాల ఏర్పాటు, వైద్యులు, ప్రొఫెసర్లు, సిబ్బంది నియామకాలు చేపట్టేలా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులకు బోధన, రోగులకు వైద్యం సక్రమంగా అందేలా ఆసుపత్రి నిర్మాణాలు తీర్చిదిద్దుతున్నాం. మౌలిక వసతులు పూర్తయ్యాక డిసెంబర్లో ఎన్ఎంసీ పరిశీలనకు వెళ్తాం.
వచ్చే ఏడాదికి అందుబాటులోకి..
వచ్చే ఏడాది నీట్ ఫలితాలు విడుదలయ్యే సమయానికి ఎన్ఎంసీ రెండు విడతల పరిశీలన పూర్తవుతుంది. వారి తనిఖీల్లో సూచించిన మార్పులను చేపట్టి ఏదేమైనా వచ్చే ఏడాది 150 వైద్య సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళికగా ముందుకెళ్తోంది.
వసతుల పెంపు
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో పాత ప్రధాన భవనం మొత్తాన్ని ఓపీ సేవలకు వినియోగించేలా చూస్తున్నాం. కొత్తగా మల్లికార్జున నగర్లో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న భవనాల్లో మొదటి రెండేళ్లు వైద్య కళాశాలగా వినియోగించి మూడేళ్లు పూర్తయ్యేనాటికి పాత ఓపీ భవనానికి కుడి, ఎడమ వైపు శాశ్వత కట్టడాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు ప్రారంభమయ్యాయి. ఇలా ఏడాదికేడాది వసతులు పెంచుకుంటూ ఎన్ఎంసీ పరిశీలనలకు వెళ్తూ అయిదేళ్లలో మొదటి బ్యాచ్ బయటికొచ్చే సమయానికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తాం.
నిర్మాణాలు సాగుతున్నాయిలా...
వైద్య కళాశాల, బోధనాసుపత్రికి సంబంధించి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.మల్లికార్జున నగర్లో నిర్మాణం పూర్తవుతుంది. ఆసుపత్రి ప్రాంగణంలోని మాతాశిశు విభాగంపైన రెండస్తుల భవనాలు స్లాబు దశ దాటాయి. ఆర్డీ కార్యాలయం వెనక విద్యార్థులు, విద్యార్థినుల వసతి గృహాల పనులు మొదలయ్యాయి. ప్రధాన భవనం మొత్తాన్ని ఆధునికీకరిస్తున్నారు.
దసరా తరువాత పూర్తిస్థాయి బాధ్యతలు
ఏపీ వైద్యవిధాన పరిషత్తు ఆధ్వర్యంలో ప్రస్తుతం ఆసుపత్రి నడుస్తున్న నేపథ్యంలో దసరా అనంతరం రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఆసుపత్రి బాధ్యతలను పూర్తిస్థాయిలో చేపడతాం. ప్రస్తుతం సిబ్బంది, ఆర్థిక లావాదేవీలు, పరికరాలు, భవనాలు, చేయాల్సిన పనులు తదితర అంశాలపై వైద్య విధాన పరిషత్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం.
పదేళ్లకు అత్యున్నతం
రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనాసుపత్రికి సంబంధించి మొదటి బ్యాచ్ బయటికొచ్చాక పీజీ సీట్ల అనుమతులు వస్తాయి. రెండేళ్ల పీజీ విద్యార్థులు కోర్సు పూర్తయి బయటికొచ్చాక సూపర్స్పెషాలిటీకి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇలా రాబోయే పదేళ్లలో నగరం, పరిసర ప్రాంత ప్రజలకు అత్యున్నతమైన సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ యాత్రన.. జనం యాతన
[ 19-04-2024]
విద్యుత్తు కట్.. అంతర్జాలం బంద్.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. -
ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం
[ 19-04-2024]
ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. -
అసలేం జరుగుతోంది..?
[ 19-04-2024]
ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్ పెట్టి తెప్పించేస్తారు. -
జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు
[ 19-04-2024]
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత తెలిపారు. -
తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. -
పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర
[ 19-04-2024]
పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. -
తొలిరోజు నామినేషన్ల సందడి
[ 19-04-2024]
ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తొలిరోజే ఆ సందడి కనిపించింది. దశమి గురువారం కావడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్రులు కూడా నామపత్రం సమర్పించారు. -
సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. -
పేపరుమిల్లు కార్మికుల ఆందోళన
[ 19-04-2024]
సీఎం పర్యటనలో భాగంగా కాన్వాయ్ గురువారం రాత్రి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్మిల్లుకు చేరుకున్న సమయంలో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 15 రోజులుగా వేతన ఒప్పందం కోరుతూ సమ్మె చేస్తున్నా పేపర్మిల్లు యాజమాన్యం స్పందించడం లేదని నినాదాలు చేశారు. -
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికలు అనగానే అందరికీ గుర్తొచ్చేది సమస్యాత్మక కేంద్రాలే. పోలింగ్ ముగిసే వరకు అధికారుల దృష్టంతా వాటిపైనే ఉంటుంది. -
అద్దె చెల్లించక అగచాట్లు
[ 19-04-2024]
వైకాపా పాలనలోని గత అయిదేళ్లలో అంగన్వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు కేవలం నోటి మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు
[ 19-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. -
‘ఆత్మ’సాక్షి లేదా.. అన్నదాతంటే పడదా..!
[ 19-04-2024]
సమీకృత వ్యవసాయం దిశగా ప్రోత్సహించడానికి, సాంకేతికత అందిపుచ్చుకొని ఆధునిక పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలుగా రైతులకు అవగాహన కల్పించి, వారిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు తీసుకువెళ్లి, అక్కడి వ్యవసాయ విధానాలు తెలుసుకునేందుకు ఆత్మ పథకాన్ని తీసుకువచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!