ఎవరి కోసం సవరణలు?
ఉమ్మడి జిల్లా పరిధిలో వైద్య విద్య, వైద్య విధాన పరిషత్తు, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆసుపత్రుల్లో పారామెడికల్ పోస్టుల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారింది. 16 విభాగాలకు సంబంధించి 320 ఖాళీల భర్తీకి ఆగస్టు 5న కాకినాడ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ జారీ చేశారు.
పారామెడికల్ పోస్టుల భర్తీలో గందరగోళం
అభ్యర్థి ధ్రువపత్రాల పరిశీలన (పాతచిత్రం)
కాకినాడ కలెక్టరేట్, మసీదుసెంటర్, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లా పరిధిలో వైద్య విద్య, వైద్య విధాన పరిషత్తు, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఆసుపత్రుల్లో పారామెడికల్ పోస్టుల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారింది. 16 విభాగాలకు సంబంధించి 320 ఖాళీల భర్తీకి ఆగస్టు 5న కాకినాడ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రాథమిక, తుది ఎంపిక జాబితాల విషయంలో పలుమార్లు సవరణలు చోటుచేసుకోవడంపై అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్గదర్శకాలు పాటించడంలో పర్యవేక్షణ లోపం, అవగాహన రాహిత్యంతో ప్రతి అంశంలోనూ సవరణలు చోటుచేసుకున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మాసిస్టుల నియామకాల విషయంలో నిబంధనలు పాటించలేదని గతంలో కొందరు వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆశ్రయించగా, అక్కడి నుంచి జిల్లా అధికారులకు అక్షింతలు పడ్డాయి. ప్రధానంగా అభ్యర్థుల మార్కుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అక్కడి నుంచి మార్గదర్శకాలు రావడంతో ప్రతిభ జాబితాలో మార్పులు చేటుచేసుకున్నాయి. వందల సంఖ్యలో నిరుద్యోగులు అధికారుల నిర్వాకానికి ఇబ్బంది పడగా.. అక్కడి అధికారులు సరిదిద్దారు. ఒక నోటిఫికేషన్కు సంబంధించి అన్ని ప్రక్రియలకూ సవరణలు తీసుకురావడం ఎవరికి మేలు చేయడానికని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సెప్టెంబరు 9లోగా అన్ని పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా.. ఇప్పటికీ పూర్తిచేయలేని స్థితిలో అధికారులున్నారు. తాజాగా శుక్రవారం కాకినాడ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి జారీ చేసిన ప్రకటన అభ్యర్థులను మరింత గందరగోళానికి గురి చేసింది. అభ్యర్థుల ఎంపిక తుది జాబితాకు మళ్లీ సవరణలు చేసినట్లు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది.
ఎన్నడూ లేదిలా...
ఆగస్టు 5న పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దీన్ని సవరిస్తూ.. పోస్టులు తగ్గిస్తూ మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. అనంతరం 14 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటి వడబోత ప్రక్రియలోనూ గందరగోళం నెలకొంది. వివిధ శాఖల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి దరఖాస్తుల పరిశీలన చేయించారు. తరువాత ప్రొవిజనల్ ప్రతిభ జాబితా ప్రచురించారు. వారం తరువాత మళ్లీ దాన్ని సవరించి రివైజ్డ్ జాబితా ప్రచురించారు. తుది ప్రతిభ జాబితా కింద 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిపించి, ధ్రువపత్రాల పరిశీలన చేశారు. ఇది పూర్తయిన తరువాత ఎంపికైన వారి జాబితా ప్రకటించాలి. దాని ప్రకారం కౌన్సెలింగ్ చేసి వారికి స్థానాలు కేటాయించాలి. అభ్యర్థులకు ఉద్యోగ నియామకపత్రాలు అందించాలి. కానీ ఇవేవీ చేయకుండా మళ్లీ నవీకరించిన ఆఖరి ప్రతిభ జాబితా(రివైజ్డ్) పెట్టారు. ఇది పూర్తిగా అభ్యర్థులను గందరగోళానికి గురిచేసింది. ఎన్నడూలేని విధంగా ఇన్ని మజిలీలు ఏంటని అభ్యర్థులు వాపోతున్నారు. నిజమైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని వేడుకుంటున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఓ ఉద్యోగి కుటుంబ సభ్యుడిని ప్రతిభ జాబితాలో చేర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఉన్నధికారుల ఆదేశాలతోనే..
ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తుది ప్రతిభ జాబితాకు సవరణలు చేయాల్సి వచ్చింది. తుది జాబితా ప్రచురించి, 1:2 నిష్పత్తితో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలన చేసిన తరువాత కొన్ని క్యాడర్లకు సంబంధించి రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కలెక్టర్ అనుమతితో తుది జాబితాను సవరించి ప్రచురించాం. ఇప్పుడు అన్ని అంశాలనూ క్రోడీకరించి తుది జాబితా రూపొందించాం. దీని ప్రకారం త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించి, అభ్యర్థులకు పోస్టింగ్లు ఇస్తాం.
- ఆర్.రమేశ్ డీఎంహెచ్వో, కాకినాడ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?