కదిలొచ్చిన నారీలోకం
నారీలోకం ఉత్సాహంగా కదిలొచ్చింది.. వివిధ కళారూపాలతో ప్రతిభ ప్రదర్శించింది. గోదావరి తీరాన మహిళాశక్తిని చాటింది. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానం వేదికగా శనివారం జరిగిన ‘దసరా మహిళా సాధికార ఉత్సవం’ ఉత్సాహభరితంగా సాగింది.
‘దిశ’ బైక్ ర్యాలీలో మంత్రి రోజా, మహిళలు, యువతులు
వి.ఎల్.పురం, టి.నగర్, కంబాలచెరువు: నారీలోకం ఉత్సాహంగా కదిలొచ్చింది.. వివిధ కళారూపాలతో ప్రతిభ ప్రదర్శించింది. గోదావరి తీరాన మహిళాశక్తిని చాటింది. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానం వేదికగా శనివారం జరిగిన ‘దసరా మహిళా సాధికార ఉత్సవం’ ఉత్సాహభరితంగా సాగింది. తొలుత ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి సుబ్రహ్మణ్య మైదానం వరకు నిర్వహించిన ‘దిశ’ బైక్ ర్యాలీలో పెద్దసంఖ్యలో మహిళలు, యువతులు పాల్గొన్నారు. ఎంపీ భరత్రామ్ ఈ ర్యాలీని ప్రారంభించగా మహిళలతో కలిసి మంత్రి రోజా సభావేదిక వరకు ద్విచక్ర వాహనం నడిపి సందడి చేశారు. అనంతరం సభావేదిక ప్రాంగణంలో మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తులు, సంప్రదాయ వంటకాలు, పౌష్టికాహారం స్టాల్స్ను మంత్రులు రోజా, తానేటి వనిత ప్రారంభించి తిలకించారు. అనంతరం మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన సభ ప్రారంభమైంది. ముందుగా యువతులు, బాలికలు.. కోలాటం, కరాటే, కర్రసాము, కత్తిసాము, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో కళాప్రతిభను ప్రదర్శించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల ప్రసంగాల అనంతరం లఘుచిత్రాల పోటీల్లో విజేతలకు, ప్రదర్శనలతో అలరించిన వారికి బహుమతులిచ్చారు.
అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
మానవ అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం పటిష్ఠ చర్యలు చేపడుతోందని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఉత్సవంలో భాగంగా శనివారం ఉదయం రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో మానవ అక్రమ రవాణా నిరోధం, దిశ పోలీసుస్టేషన్లను పటిష్టపరచడం తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐడీ(మహిళా సంరక్షణ) ఎస్పీ కేజీవీ సరిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నిరోధానికి పోరాడే వ్యక్తులు సామాజిక ధర్మం కోసం పాటుపడుతున్నామనే ఆలోచన, నిబద్ధతతో పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని దిశ పోలీసులు, సిబ్బందికి సూచించారు. మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీ రాసిన ‘ఆమెకు తోడుగా న్యాయదేవత’ పుస్తకాన్ని సరిత ఆవిష్కరించారు. మహిళా కమిషన్ కార్యదర్శి శైలజ, సభ్యులు పాల్గొన్నారు.
‘ఆమె’ లఘుచిత్రానికి ప్రథమ బహుమతి
ఉత్తమ నటీనటులు వీరే..
లఘుచిత్ర ఉత్తమ నటిగా బండారు నాగరాణి (సబల), ఉత్తమ నటుడిగా సూర్య ఆకొండ(ఆమె), ఉత్తమ రచయితగా మల్లికార్జున(నర రాక్షస), ఉత్తమ దర్శకులుగా బాల(దిశది పవర్ఆఫ్ ఉమెన్)లు ఎంపికకాగా వీరికి ఒక్కొక్కరికి రూ.20 వేలు ఇచ్చారు.
లఘుచిత్రాలకు బహుమతులు
‘సబల’ రాష్ట్రస్థాయి లఘుచిత్ర(షార్ట్ఫిల్మ్) పోటీలకు వివిధ జిల్లాల నుంచి వందకు పైగా లఘుచిత్రాలు రాగా వీటిలో ఎనిమిది ఎంపికయ్యాయి. మొదటి బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు, మిగతా అయిదు లఘు చిత్రాలకు రూ.25 వేలు చొప్పున ఇచ్చారు. ‘ఆమె’ జె.ఎంటర్టైన్మెంట్(కాకినాడ), ‘సబల’ షారోన్ ఫిలింస్(గుంటూరు), ‘రాధిక’ మైరా క్రియేటివ్స్(రాజమహేంద్రవరం) షార్ట్ఫిల్మ్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకున్నాయి. ‘నాకు మీరు మీకు నేను’ యూనివర్సల్ క్రియేషన్స్(రాజమహేంద్రవరం), ‘స్వేచ్ఛ’ డ్రీమ్ మేకర్స్(గుంటూరు), ‘భవిత’ వంశీమీడియా(చిలకలూరిపేట) ‘మహిళలు మీకు వందనం’ సత్తి రత్నకుమారి ఫిలిమ్స్(మాచవరం), ‘సర్వం సబల శక్తిమయం’ ఎంకే ప్రొడక్షన్స్ బహుమతులందుకున్నాయి.
సాధికారత ఉత్సవ సంరంభం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోసపు దీవెన.. సొమ్మురాక వేదన
[ 25-04-2024]
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తామని... దాని కోసం విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. -
ప్రతి గొంతూ జేజేలు
[ 25-04-2024]
నడినెత్తిన సూరీడు సుర్రుమంటుంటే.. పూల జల్లుల వాన కురిసింది.. గొంతులన్నీ ఒక్కటై జేజేలు కొట్టాయి. జనసేన.. తెదేపా.. భాజపా జెండాలు రెపరెపలాడాయి. -
నియమావళికి సెలవిచ్చి.. మంత్రి హామీకి విలువిచ్చి..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేముందు హడావుడిగా జిల్లావ్యాప్తంగా అనేక పనులకు వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు శంకుస్థాపనలు చేశారు. వీటిలో కొన్ని పనులు నేటికీ ప్రారంభించనేలేదు. -
జగన్.. మాపై ఎందుకింత కక్ష?
[ 25-04-2024]
గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకు వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.కోట్లలో ఖర్చు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు కార్పొరేషన్ రుణాలకు ఎగనామం పెట్టింది. -
సర్కారు సహకారం కరవై.. నిర్వహణ భారమై..
[ 25-04-2024]
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం తాడితోట వస్త్రమార్కెట్ గత అయిదేళ్లుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వ్యాపారాలు పడిపోయి వెలవెలబోతోంది. -
కొవ్వూరు వైకాపాలో రగడ
[ 25-04-2024]
కొవ్వూరు నియోజకవర్గ వైకాపాలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గ పరిశీలకుడి పదవి చిచ్చు రెండు సామాజికవర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. -
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ పర్వం గురువారంతో ముగియనుంది. పోటీచేసే అభ్యర్థుల నుంచి చివరిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్
[ 25-04-2024]
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపరుమిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నోటీసు బోర్డులో పెట్టడంతో గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఎన్నికల వేళ కుర్చీల లొల్లి!
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులను తరలించేందుకు వీల్ఛైర్లు అవసరం.. అయితే గుత్తేదారుల నుంచి కొనుగోలు చేసిన వీటికి పంచాయతీల ఖజానా నుంచి డబ్బులు చెల్లించమనడంపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అట్టహాసంగా నామినేషన్లు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. -
ఉద్యోగులు, పింఛనుదారులను పట్టించుకోని ప్రభుత్వం
[ 25-04-2024]
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు పాలంకి సుబ్బరాయన్, పెద్దన్నగౌడ్ వాపోయారు. -
మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు
[ 25-04-2024]
ఎన్నికల నేపథ్యంలో ఓటు అమ్మొద్దు.. ఓటు కొనద్దు.. అంటూ ఓ పౌరుడు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికంగా అందర్నీ ఆలోచింపజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో జై భారత్ -
నన్నయలో ఖేలో ఇండియా ప్రాజెక్ట్ కమిటీ సభ్యుల పర్యటన
[ 25-04-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా పథకానికి సంబంధించిన పనులను కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. -
భీమేశ్వరుని గర్భాలయం మూసివేత
[ 25-04-2024]
కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం