logo

దూసుకెళ్తున్న గోదావరి జిల్లాలు

8వ రాష్ట్రస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో తూర్పు గోదావరి జిల్లా క్రీడాకారులు తమదైన క్రీడా నైపుణ్యంతో విజయపరంపరతో ముందుకు దూసుకెళ్తున్నారు.

Published : 02 Oct 2022 04:20 IST

తలపడుతున్న తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: 8వ రాష్ట్రస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో తూర్పు గోదావరి జిల్లా క్రీడాకారులు తమదైన క్రీడా నైపుణ్యంతో విజయపరంపరతో ముందుకు దూసుకెళ్తున్నారు. శ్రీకాళహస్తిలోని ఆర్‌పీబీఎస్‌ జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం నిర్వహించిన క్రీడా పోటీల్లో తూర్పు గోదావరి జిల్లా క్రీడాకారులు కృష్ణ, పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాలపై విజయకేతనం ఎగురవేసి ఫైనల్స్‌ వైపు దూసుకెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చిత్తూరు, కర్నూలు జిల్లాలను అలవోకగా ఓడించింది. చిత్తూరు జిల్లా కర్నూలుపై గెలవగా, ఇక అనంతపురం జిల్లా పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాలపై విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని